‘సీరం’ అగ్నిప్రమాదం.. నష్టం ₹1000 కోట్లు పైనే!
కరోనా నిరోధించేందుకు ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ని తయారుచేసిన ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.....
ఎస్ఐఐ సీఈవో పూనావాలా వెల్లడి
ముంబయి: కరోనా నివారణకు ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ను తయారుచేసిన ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పుణెలోని మంజరి ప్రాంగణంలోని కొత్త ప్లాంట్లో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఐదుగురు కాంట్రాక్టు కార్మికులు మృతిచెందారు. అయితే, ఈ ప్రమాదంతో తమ సంస్థకు ఆర్థికంగా రూ.1000 కోట్ల కంటే ఎక్కువే నష్టం వాటిల్లినట్టు ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం కరోనా వ్యాక్సిన్ల తయారీపై ఎలాంటి ప్రభావం చూపకపోయినప్పటికీ.. కొత్తగా ఉత్పత్తి చేయబోయే మార్గాలను మాత్రం దెబ్బకొట్టిందని తెలిపారు. వ్యాక్సిన్లు తయారీ జరిగిన చోట మంటలు చెలరేగలేదన్న ఆయన.. టీకాల తయారీకి అక్కడ ఉంచిన పరికరాలు, ఇతర ప్రొడక్ట్లు దెబ్బతిన్నాయన్నారు. రోటా, బీసీజీ టీకాలకు సంబంధించి భారీగా నష్టం జరిగినట్టు తెలిపారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సీరమ్ ఇన్స్టిట్యూట్ను శుక్రవారం సందర్శించారు. కొవిషీల్డ్ టీకాకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. ‘కరోనా టీకా యావత్ ప్రపంచానికి ఓ ఆశాకిరణం. సీరంలో అగ్నిప్రమాద ఘటన గురించి విని మనమంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యాం. సీరమ్ను సందర్శించిన తర్వాత వ్యాక్సిన్ ఉత్పత్తి యూనిట్కు ఎలాంటి నష్టం జరగలేదని భరోసా ఇస్తున్నా. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ఈ ఘటనకు కారణాలేంటనేది దర్యాప్తు జరిగిన తర్వాతే తెలుస్తుంది’’ అని చెప్పారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగాన్ని ముందుగా అనుకున్న సమయానికంటే 4 సెకన్లు ఆలస్యంగా చేపట్టినట్లు ఇస్రో తాజా నివేదికలో వెల్లడించింది. -
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
పెళ్లి పత్రికలో ప్రధాని మోదీ పేరును ప్రస్తావించడం ఓ నవ వరుడిని చిక్కుల్లో పడేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!