కరోనా ఎఫెక్ట్: పెళ్లి మండపాల్లో మార్షల్స్‌

గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కొవిడ్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు పెళ్లి మండపాల్లో మార్షల్స్‌ను ఏర్పాటు చేయనుంది....

Updated : 23 Feb 2021 13:45 IST

బెంగళూరు: గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కొవిడ్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు పెళ్లి మండపాల్లో మార్షల్స్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రజలు కొవిడ్‌ మార్గదర్శకాలను పాటించేలా వేడుకల వద్ద మార్షల్స్‌ను నియమించనున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు. వివాహాది శుభకార్యాలు, ఇతర సమావేశాల్లో ఎక్కువ మందిని అనుమతించేది లేదని, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆయన వెల్లడించారు.

వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా కర్ణాటకలోని కలబురగి జిల్లా యంత్రాంగం ప్రయాణ మార్గదర్శకాలు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి కలబురగి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ పత్రాన్ని చూపించాలని యంత్రాంగం స్పష్టం చేసింది. ఇందుకోసం సరిహద్దులో ఐదు చెక్‌ పాయింట్లు ఏర్పాటు చేసింది. ఇతర సరిహద్దుల్లోనూ ఇవే నిబంధనలను అమలు చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని