NTAGI: యాంటీబాడీలు తగ్గిపోతాయ్.. బూస్టర్ డోసు త్వరగా తీసుకోండి..!
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా వీలైనంత తొందరగా బూస్టర్ డోసులు (Booster Dose) తీసుకోవాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (NTAGI) ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోఢా సూచించారు.
కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ ఎన్కే అరోరా సూచన
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా వీలైనంత తొందరగా బూస్టర్ డోసులు (Booster Dose) తీసుకోవాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (NTAGI) ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా సూచించారు. ముందుగా తీసుకున్న వ్యాక్సిన్ల నుంచి పొందిన యాంటీబాడీలు ఆరు నుంచి ఎనిమిది నెలల్లో తగ్గిపోతుండటంతో వీలైనంత తొందరగా ప్రికాషనరీ డోసు (Booster Dose) తీసుకోవాలని స్పష్టం చేశారు.
‘వివిధ రకాల వైరస్లతోపాటు కొవిడ్-19 కూడా వ్యాప్తిలో ఉంది. అదృష్టవశాత్తూ అది తీవ్ర ప్రభావాన్ని చూపించకపోవడంతోపాటు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ మనచుట్టూ కరోనా వ్యాప్తి కొనసాగుతోందన్న విషయాన్ని మరచిపోవద్దు’ అని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్కే అరోరా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించిన ఆయన.. భవిష్యత్తులో మన ఆరోగ్యానికి అది ఇన్సూరెన్స్గా పనిచేస్తాయని అన్నారు. గడిచిన ఎనిమిది నెలల్లో ఆస్పత్రి పాలైన కరోనా రోగుల్లో 90శాతం మంది బూస్టర్ తీసుకోని వారేనని ఎన్కే అరోరా స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, దేశంలో నిత్యం వేల సంఖ్యలో కొవిడ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 7231 కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 64,667కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.