Omicron: చైనా టీకా.. బూస్టర్ ఇచ్చినా రక్షణ నిల్..!
చైనాకు చెందిన సినోవాక్ (Sinovac) బయోటెక్ తయారు చేసిన టీకాను మూడు డోసుల్లో ఇచ్చినప్పటికీ ఒమిక్రాన్ను తటస్థీకరించేందుకు అవసరమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేయడంలో విఫలమవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
సినోవాక్ టీకా సామర్థ్యంపై తాజా అంచనాలు
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ భయాలు నెలకొన్న వేళ బూస్టర్ డోసు పంపిణీపై ఆయా దేశాలు దృష్టి సారించాయి. ఇదే సమయంలో ఇవి కొత్త వేరియంట్ల నుంచి ఏ మేరకు రక్షణ కల్పిస్తాయనే విషయాన్ని తెలుసుకునేందుకు అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చైనాకు చెందిన సినోవాక్ (Sinovac) బయోటెక్ తయారు చేసిన టీకాను మూడు డోసుల్లో ఇచ్చినప్పటికీ ఒమిక్రాన్ను తటస్థీకరించేందుకు అవసరమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేయడంలో విఫలమవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సినోవాక్ టీకా విస్తృత వినియోగంలో ఉంది. ముఖ్యంగా చైనాతోపాటు థాయిలాండ్, ఇండోనేసియావంటి దేశాల్లో భారీగా పంపిణీ చేస్తున్నారు. దాదాపు 230కోట్ల డోసులను ఉత్పత్తిచేసిన సినోవాక్ చైనాలో అత్యధికంగా పంపిణీ చేయడంతోపాటు వివిధ దేశాలకు కూడా సరఫరా చేశారు. అయితే, ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న వారికి మూడో డోసు ఇచ్చి పరీక్షించగా ఒమిక్రాన్ను ఎదుర్కోవడం లేదని తేలింది. దీంతో బూస్టర్ డోసుగా జర్మనీకి చెందిన బయోఎన్టెక్ వ్యాక్సిన్ను ఇచ్చి ప్రయోగించారు. దీంతో ఒమిక్రాన్ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు గుర్తించారు. ఈ పరిశోధనలను యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్తోపాటు చైనీస్ యూనివర్సిటీ హాంకాంగ్ కలిపి చేపట్టాయి.
తాము అభివృద్ధి చేసిన సినోవాక్ మూడు డోసులను తీసుకున్న 94 శాతం మందిలో వైరస్ను తటస్థీకరించే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు ఆ సంస్థ ఇటీవలే వెల్లడించింది. కానీ, ఏ స్థాయిలో ఉన్నాయనే విషయాన్ని వెల్లడించలేదు. ఇదే సమయంలో రెండు డోసులతో మాత్రం ఒమిక్రాన్ను ఎదుర్కోలేమని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డేవిడ్ హుయ్ వెల్లడించారు. బూస్టర్ డోసు తీసుకునేందుకు హాంకాంగ్ అధికారులు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ అధ్యయన ఫలితాలు అక్కడి అధికారులను కలవరపెడుతున్నాయి.
అయితే, కొవిడ్-19 కట్టడికి చైనా కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో విస్తృత వేగంతో వ్యాపిస్తోన్న ఒమిక్రాన్పైనా ఆందోళన చెందుతోంది. తాజాగా చైనాలో పెద్ద నగరాల్లో ఒకటైన జియాన్లో నిరవధిక లాక్డౌన్ విధించింది. 1.3కోట్ల జనాభా ఉన్న ఈ నగరంలో వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్న చైనా అధికారులు.. అత్యవసరమైతే తప్ప ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు. ఇలాంటి సమయంలో బూస్టర్ డోసు ఇచ్చినా రక్షణ తక్కువేనని తేలడం చైనాకు ఓ సవాలేనని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 260కోట్ల డోసులను పంపిణీ చేయగా.. వాటిలో అత్యధికం సినోవాక్వే కావడం గమనార్హం. ఇక ప్రయోగాల ఫలితాలను కూడా బాహ్య ప్రపంచానికి వెల్లడించని చైనా టీకాల పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.