Lakhimpur Kheri: ప్రియాంకా గాంధీపై కేసు నమోదు.. రెండో రోజూ నిర్బంధంలోనే!
శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే కారణంగా ప్రియాంకా గాంధీతో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేశామని స్థానిక హర్గావున్ పోలీసులు పేర్కొన్నారు.
ఆందోళనలకు దిగుతోన్న కాంగ్రెస్ నేతలు
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ ఖేరీలో నలుగురు రైతులు మృతి చెందిన అనంతరం రెండో రోజు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రాను లఖింపుర్ చేరకముందే అడ్డుకున్న పోలీసులు.. ఓ గెస్ట్హౌస్లో నిర్బంధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే కారణంగా ఆమెతో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేశామని స్థానిక హర్గావున్ పోలీసులు పేర్కొన్నారు.
ఎటువంటి ఎఫ్ఐఆర్, వారెంట్ లేకుండానే పోలీసులు 28గంటలుగా తనను నిర్బంధించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం ఉదయం ఓ వీడియో విడుదల చేశారు. ఇదే సమయంలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు లఖ్నవూ వచ్చిన ప్రధాని మోదీ.. బాధిత కుటుంబాలను పరామర్శించాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు తమ నేతను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంకా గాంధీ నిర్బంధించడంపై యూపీ పోలీసులు స్పందించారు. సెక్షన్ 144 అమలులో ఉన్న సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోనే ఆమెతో పాటు మరో పదిమందిపై ఐపీసీ సెక్షన్ 107/16 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే, అక్టోబర్ 4వ తేదీ ఉదయమే ప్రియాంకా గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకొగా.. ప్రస్తుతం ఆమె ఉన్న సీతాపూర్లోని పీఏసీ గెస్ట్హౌస్నే తాత్కాలిక జైలుగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలను తెలియజేస్తూ జిల్లా మెజిస్ట్రేట్కు హర్గావున్ పోలీసులు నివేదిక అందించినట్లు తెలస్తోంది.
కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని నిర్బంధించడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఉదయం 4.30 ప్రాంతంలో ప్రియాంకా గాంధీని అరెస్టు చేయడం అక్రమణం, సిగ్గుచేటు అని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం విమర్శించారు. అంతేకాకుండా ఇప్పటివరకూ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇక ప్రియాంక గాంధీని కలిసేందుకు సీతాపూర్ బయలుదేరిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ను లఖ్నవూ విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఎయిర్పోర్టులోనే సీఎం బైఠాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
నోటా విజేతగా నిలిస్తే?
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?