Gandhi Jayanti: రాజ్‌ఘాట్‌ వద్ద జాతిపితకు ప్రముఖుల నివాళులు

జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా దిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.

Updated : 02 Oct 2021 17:31 IST

దిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా దిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తదితరులు నివాళులు అర్పించారు. రాజ్‌ఘాట్ వద్ద కాసేపు మౌనం పాటించి జాతిపిత త్యాగాలను స్మరించుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని