Sushmita Dev: కాంగెస్ పార్టీకి మరో షాక్
మరో కీలక నేత, అస్సాంకు చెందిన సుష్మితా దేవ్ సోమవారం కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఉన్న ఆమె పార్టీని వీడటం కాంగ్రెస్ను పెద్ద దెబ్బనే చెప్పాలి. అలాగే ఈ రోజు ఆమె తృణమూల్ కాంగ్రెస్లో చేరనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.
పార్టీని వీడిన కీలక నేత సుష్మితా దేవ్
దిల్లీ: మరో కీలక నేత, అస్సాంకు చెందిన సుస్మితా దేవ్ సోమవారం కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఉన్న ఆమె పార్టీని వీడటం కాంగ్రెస్ను పెద్ద దెబ్బనే చెప్పాలి. అలాగే ఈ రోజు ఆమె తృణమూల్ కాంగ్రెస్లో చేరనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.
ఈ రోజు ఉదయం ట్విటర్ బయోను కాంగ్రెస్ ‘మాజీ సభ్యురాలు’ అని మార్చడంతో పార్టీని వీడుతున్నారనే వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఆమె పార్టీని వీడినట్లు సీనియర్నేత కపిల్సిబల్ ధ్రువీకరించారు. కాగా, సుస్మిత ప్రస్తుతం కోల్కతాలో ఉన్నారు. ఆమె తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆ పార్టీ నేత అభిషేక్ బెనర్జీతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ‘ఒకవేళ ఆమె తృణమూల్లో చేరితే.. అస్సాంలో ఆ పార్టీకి చెందిన కీలక నేతగా మారనున్నారు’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ప్రజా సేవలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు పార్టీని వీడుతున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో సుష్మిత పేర్కొన్నారు. ఆమె తండ్రి సంతోశ్ మోహన్ దేవ్ అస్సాంలో అత్యంత ప్రజాదరణ ఉన్న కాంగ్రెస్ నేత. ఇదిలా ఉండగా.. వరుసగా ఒక్కో నేత పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్ వైఖరిని సిబల్ తప్పుపట్టారు. పార్టీలో భారీమార్పులు అవసరం అంటూ గతంలో ఆయన అసమ్మతి గళం వినిపించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.