Voter ID: ఆచరణ సాధ్యం కాదనుకున్న కార్డు.. ‘చిరునామా’కు మారుపేరుగా నిలిచి!
ఓటరు కార్డు (Voter ID)కు 1957లోనే రూపకల్పన చేసినప్పటికీ.. పూర్తిస్థాయిలో అది కార్యరూపం దాల్చేందుకు దాదాపు మూడు దశాబ్దాలు పట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రజాస్వామ్య పండగగా అభివర్ణించే ఎన్నికల నిర్వహణ ఒక సవాల్ అనే చెప్పవచ్చు. ఎటువంటి అక్రమాలకు తావులేకుండా వీటిని నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) పలు చర్యలు చేపడుతోంది. ఇందులో కీలకమైన ఓటరు కార్డు (Voter ID)కు 1957లోనే రూపకల్పన చేసినప్పటికీ.. పూర్తిస్థాయిలో అది కార్యరూపం దాల్చేందుకు దాదాపు మూడు దశాబ్దాలు పట్టింది. ఒకరికి బదులు మరొకరు ఓటు వేయకుండా నిరోధించడంలో కీలకమైన ఈ ఓటరు కార్డును 1993లో అందుబాటులోకి తేగా.. ప్రస్తుతం అది ఓటరు గుర్తింపుగానే కాకుండా వ్యక్తుల చిరునామా ధ్రువీకరణ పత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది.
తొలి ప్రయత్నం విఫలం..
ఓటర్లకు ఫొటో ఐడీ కార్డులను జారీ చేసే ప్రక్రియను తొలిసారిగా 1960లో చేపట్టారు. కలకత్తా (సౌత్-వెస్ట్) పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికల సమయంలో పైలట్ ప్రాజెక్టు కింద వీటిని అందజేశారు. కానీ, పూర్తిస్థాయిలో విజయవంతం కాకపోవడంతో దాదాపు రెండు దశాబ్దాల పాటు అది అటకెక్కింది. మళ్లీ 1979లో సిక్కిం అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీటిని జారీ చేయగా.. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, నాగాలాండ్లలోనూ తీసుకొచ్చారు. ఇవే 1993లో దేశవ్యాప్త ఫొటో ఐడీ జారీకి నాంది పలికాయి. వీటికి సంబంధించి ప్రజాప్రాతినిధ్య (సవరణ) బిల్లు -1958లో ఓ ఆసక్తికర నిబంధన ఉంది. భారత్లో ఎన్నికల ప్రయాణంపై ఈసీ ప్రచురించిన ‘లీప్ ఆఫ్ ఫెయిత్ (Leap of Faith)’ పుస్తకంలో పేర్కొన్నారు.
దిగువ సభలో నవంబర్ 27, 1958న ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని చూసి సంతోషం అనిపించిందని భారత తొలి ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) సుకుమార్ సేన్ రిటైర్మెంట్ సమయంలో వెల్లడించారు. బిల్లును ప్రవేశపెట్టిన అప్పటి న్యాయశాఖ మంత్రి అశోక్కుమార్ సేన్.. సుకుమార్ సేన్ తమ్ముడు కావడం విశేషం. చివరకు డిసెంబర్ 30, 1958న ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. అప్పటికే రెండో ఎన్నికల ప్రధాన కమిషనర్గా కేవీకే సుందరం బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 20, 1958 నుంచి సెప్టెంబర్ 30, 1967 వరకు పదవిలో ఉన్న ఆయన.. సుదీర్ఘకాలం సీఈసీగా కొనసాగిన వ్యక్తిగానూ రికార్డు సృష్టించారు. 1957 సార్వత్రిక ఎన్నికల తర్వాత, రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ఫొటోలతో కూడిన గుర్తింపు కార్డులను జారీ చేయడం వల్ల పోలింగ్ సమయంలో ఓటర్లను గుర్తించడం తేలిక అవడంతోపాటు దొంగ ఓట్లను (impersonation) నివారించవచ్చని అప్పట్లో ఇచ్చిన నివేదికలో కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
కారణాలు ఇవే..
కలకత్తా (సౌత్-వెస్ట్)లో 3.42 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 10 నెలలు కష్టపడి 2.13 లక్షల ఓటర్ల ఫొటోలను మాత్రమే సేకరించగలిగారు. ఇందులో 2.10 లక్షల మందికి ఫొటో ఐడీ కార్డులు జారీ చేశారు. ఇందుకు కారణం.. మహిళా ఓటర్లు ముందుకు రాకపోవడమేనట. మహిళా, పురుష ఫొటోగ్రఫర్లను నియమించినప్పటికీ మహిళా ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాదు, కేవలం ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు కలకత్తా ప్రాంతానికే రూ.25 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఖర్చుపరంగా అదనపు భారం కావడం, కమిషన్లో మిషనరీపై సమీక్ష జరిపిన ఈసీ.. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. కలకత్తా లేదా దేశవ్యాప్తంగా సంతృప్తికర స్థాయిలో ఈ ప్రక్రియ చేపట్టడం ఆచరణ సాధ్యం కాదని ఎన్నికల సంఘం నిర్ణయానికి వచ్చింది.
ఇలా దాదాపు మూడు దశాబ్దాల పాటు ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో ముందుకు సాగలేదు. చివరకు 1993లో ఓటరు కార్డుల జారీకి మళ్లీ శ్రీకారం చుట్టారు. క్రమంలో దేశవ్యాప్తంగా ప్రతీ ఓటరుకు గుర్తింపుకార్డు ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేసింది. 2021లో ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫొటో ఐడీ కార్డుల (EPIC)ను తీసుకొచ్చారు. పీడీఎఫ్లో ఉండే ఈ డిజిటల్ కార్డును మార్చేందుకు వీలులేకుండా రూపొందించారు. ఓటరు వివరాలతోపాటు క్యూఆర్కోడ్నూ పొందుపరిచిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) దాదాపు 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని రాహుల్ గాంధీ ఆరోపించారు. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
Delhi Commission for Women: దిల్లీ మహిళా కమిషన్లో 223 మంది ఉద్యోగులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వేటు వేశారు. వారిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించారు. -
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
మండుటెండల్లో వాహనదారులకు కాస్త ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ షేడ్ నెట్స్ను ఏర్పాటు చేసింది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం