Tamil nadu: పట్టపగలే రెండు హత్యలు.. పోలీసులపై గ్రెనేడ్ దాడులు.. ఇద్దరు నిందితుల హతం
తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలో సంచలనం రేపిన ఇద్దరు యువకుల హత్య ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను ఎన్కౌంటర్ చేశారు......
చెన్నై: తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలో సంచలనం రేపిన ఇద్దరు యువకుల హత్య ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు క్రమంలో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో వారు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారని, ఈ క్రమంలోనే కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. వారి దాడిలో తమకు గాయాలైనట్లు తెలిపారు.
అసలేం జరిగిందంటే..
చెంగల్పట్టు జిల్లా కేంద్రానికి చెందిన అప్పు అలియాస్ కార్తిక్.. గురువారం ఓ టీ షాప్నకు వెళ్లాడు. ఆ సమయంలో ముగ్గురు దుండగులు ద్విచక్రవాహనంపై కార్తిన్ను వెంబడించారు. కొద్ది దూరం వెళ్లగానే అతడిపై గ్రెనేడ్ దాడి చేశారు. కార్తిన్ కిందపడిపోగానే కత్తులతో విచక్షణారహితంగా పొడిచి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అదే గ్యాంగ్ ఆ తర్వాత మరో హత్యకు పాల్పడింది. చెంగల్పట్టు ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారి శ్రీనివాస్ కుమారుడు మహేశ్ను హతమార్చారు. ఇంట్లో ఒక్కడే ఉండగా ఇంట్లోకి చొరబడి కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకుని, మృతదేహాలను శవపరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పట్టపగలు, అత్యంత రద్దీ ప్రాంతాల్లో రెండు హత్యలు జరగటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. దినేశ్, మొహిదీన్ అనే ఇద్దరితోపాటు మరికొందరిని నిందితులుగా గుర్తించారు. దినేశ్, మొహిదీన్ అటవీ ప్రాంతంలో తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో.. వారిని పట్టుకునేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లారు. అయితే నిందితులు పోలీసులపై సైతం గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేశారు. ఈ హత్యలకు సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. గ్రెనేడ్ దాడిలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.