Beaches: భారత్లో ఆ బీచ్లకు అరుదైన గౌరవం
ప్రపంచ పరిశుభ్ర బీచ్ల జాబితాలో కేరళలోని ‘కోవలం’, పుదుచ్చేరిలోని ‘ఈడెన్’ బీచ్లు తాజాగా చోటు సంపాదించుకున్నాయి. ‘బ్లూ ఫ్లాగ్’ బీచులుగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాయి.
కేరళ ‘కోవలం’, పుదుచ్చేరిలోని ‘ఈడెన్’ బీచ్లకు ‘బ్లూఫ్లాగ్’ ట్యాగ్
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ పరిశుభ్ర బీచ్ల జాబితాలో కేరళలోని ‘కోవలం’, పుదుచ్చేరిలోని ‘ఈడెన్’ బీచ్లు తాజాగా చోటు సంపాదించుకున్నాయి. ‘బ్లూ ఫ్లాగ్’ బీచులుగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాయి. గతేడాది దేశంలోని ఎనిమిది బీచ్లు ‘బ్లూ ఫ్లాగ్’ ట్యాగ్ పొందగా.. అందులో ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ ‘రుషికొండ’ బీచ్ కూడా ఉంది. కేరళ ‘కోవలం’, పుదుచ్చేరిలోని ‘ఈడెన్’ బీచ్ లతో కలిపి.. గతంలో ఎనిమిదిగా ఉన్న సంఖ్య కాస్త 10కి చేరింది. ఇదే విషయాన్ని ట్విటర్ వేదికగా కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. భారత్లో శివరాజ్పూర్-గుజరాత్, ఘోగ్లా -డయ్యూ, కాసర్కోడ్, పదుబిద్రి-కర్ణాటక, కప్పడ్-కేరళ, రుషికొండ- ఆంధ్రప్రదేశ్, గోల్డెన్-ఒడిశా, రాధానగర్, అండమాన్ నికోబార్ ‘బ్లూ ఫాగ్’ ధ్రువపత్రం పొందిన జాబితాలో ఉన్నాయి.
‘బ్యూ ఫ్లాగ్’ ధ్రువపత్రం వేటికి ఇస్తారంటే..?
డెన్మార్క్కి చెందిన పర్యావరణ అవగాహన సంస్థ ‘ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్’ (FEE) అనే సంస్థ... బీచ్లకు ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికెట్లు ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ సంస్థ సర్టిఫికెట్ పొందడం అంత ఆషామాషీ కాదు. బీచ్లకు సంబంధించి అనేక స్థాయిల్లో పర్యావరణం, స్నానపు నీటి నాణ్యత, పరిశుభ్రత నిర్వహణ, బీచ్ల వద్ద భద్రత, సేవలు.. ఇలా 33 ప్రమాణాలను పరిశీలించి వాటికి అనుగుణంగా ఉంటేనే ఈ ట్యాగ్ అందజేస్తారు. ప్రపంచం మొత్తంలో బ్లూ ఫ్లాగ్ బీచ్లను పరిశుభ్రమైన బీచ్లుగా పరిగణిస్తారు.
ఇదే పర్యాటకులకు కలిగే లాభం..
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పర్యాటకం మీదే ఆధారపడి అభివృద్ధి చెందుతున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సమయం గడిపేందుకు బ్లూ ట్యాగ్లు పొందిన బీచ్లు శ్రేయస్కరం. ముఖ్యంగా స్నానం చేయడానికి స్వచ్ఛమైన నీరు, ఆరోగ్యకరమైన వాతావరణం, చుట్టూ పరిశుభ్రత ఇక్కడ ఉంటుంది. అందుకే మిగితా బీచ్లతో పోలిస్తే బ్లూ ట్యాగ్ బీచ్లను సందర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 2018 జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీచ్లను శుభ్రం చేయడానికి భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ ‘ఐ యామ్ సేవింగ్ మై బీచ్’ ప్రచారం ప్రారంభించింది. దేశంలోని 13 తీర రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!