Myanmar: అమెరికాకు ఎదురుదెబ్బ! ఆ దేశ జర్నలిస్టుకు మయన్మార్లో జైలుశిక్ష
మయన్మార్లో సైన్యం నిర్బంధించిన జర్నలిస్టులను విడిపించేందుకు యత్నిస్తున్న అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ! ఇక్కడి జుంటా కోర్టు శుక్రవారం అమెరికన్ జర్నలిస్ట్ డానీ ఫెన్స్టర్కు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం, మిలిటరీపై రెచ్చగొట్టే ప్రవర్తన...
యాంగూన్: మయన్మార్లో సైన్యం నిర్బంధించిన జర్నలిస్టులను విడిపించేందుకు యత్నిస్తున్న అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడి జుంటా కోర్టు శుక్రవారం అమెరికన్ జర్నలిస్ట్ డానీ ఫెన్స్టర్కు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం, సైన్యంపై ప్రజలను రెచ్చగొట్టే ప్రవర్తన, వీసా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై అతనికి ఈ శిక్ష పడింది. అమెరికా మాజీ దౌత్యవేత్త, బందీలుగా ఉన్నవారి తరఫున మాట్లాడేందుకు నియమించిన బిల్ రిచర్డ్సన్ ఇటీవల జుంటా చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్ను కలిసిన కొద్ది రోజులకే ఈ తీర్పు వెలువడటం గమనార్హం. ‘ఫ్రంటియర్ మయన్మార్’లో మేనేజింగ్ ఎడిటర్గా పనిచేస్తున్న ఫెన్స్టర్.. ఏడాదిగా ఇక్కడే పనిచేస్తున్నారు. మేలో తన కుటుంబాన్ని చూసేందుకు అమెరికాకు వెళ్తుండగా సైన్యం అతన్ని నిర్బంధించింది. అతనిపై దేశద్రోహం, తీవ్రవాద ఆరోపణలూ మోపింది. దీంతో జీవిత ఖైదు పడే అవకాశాలు ఉన్నాయి.
‘తీవ్ర నిరాశకు లోనయ్యాం’
ఫెన్స్టర్కు జైలు శిక్ష పడటంపై తీవ్ర నిరాశకు లోనయినట్లు పత్రికా యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. వీలైనంత త్వరగా అతను విడుదలవుతాడని ఆశిస్తున్నట్లు పేర్కొంది. క్రైసిస్ గ్రూప్ మయన్మార్ సీనియర్ సలహాదారు రిచర్డ్ హార్సీ మాట్లాడుతూ.. ఈ తీర్పును ‘దౌర్జన్యం’గా అభివర్ణించారు. దీంతో వాస్తవాలు మాట్లాడితే శిక్ష పడుతుందని అంతర్జాతీయ జర్నలిస్టులకే కాదు.. స్థానిక జర్నలిస్టులకూ సందేశం వెళ్తోందని చెప్పారు. మరోవైపు అతన్ని విడిపించేందుకు అమెరికా దౌత్యవేత్తలు కృషి చేస్తున్నారని తెలిపారు. కానీ.. ప్రస్తుత తీర్పు అమెరికా ప్రయత్నాలకు విఘాతం అని అన్నారు. ఫిబ్రవరిలో ఆంగ్సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి, అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం.. అప్పటినుంచి ప్రజాస్వామ్యవాదులతోపాటు మీడియాను అణచివేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో జర్నలిస్టులను నిర్బంధించింది. 31 మంది ఇంకా నిర్బంధంలోనే ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు స్థానికంగా నిరసనల్లో పాల్గొన్న దాదాపు 1,200 మందిని హతమార్చినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలపై అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం