Donald Trump: ‘ఆ ఆయుధాలను ధ్వంసం చేయలేదు.. ఇప్పుడు చైనా, రష్యాలకు ప్రయోజనం’
అఫ్గాన్నుంచి బలగాల ఉపసంహరణ క్రమంలో అమెరికా పెద్దఎత్తున అధునాత ఆయుధ సామగ్రిని అక్కడే విడిచిపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వాటిని పనికిరాకుండా చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. కానీ.. సైన్యం వాటిని ధ్వంసం చేయకుండానే తిరిగొచ్చిందని...
వాషింగ్టన్: అఫ్గాన్నుంచి బలగాల ఉపసంహరణ క్రమంలో అమెరికా పెద్దఎత్తున అధునాత ఆయుధ సామగ్రిని అక్కడే విడిచిపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వాటిని పనికిరాకుండా చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. కానీ.. సైన్యం వాటిని ధ్వంసం చేయకుండానే తిరిగొచ్చిందని దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి విమర్శలకు దిగారు. ఆ ఆయుధ సంపదతో ప్రస్తుతం రష్యా, చైనా సహా ఇతర శక్తులకు ప్రయోజనం చేకూరుతోందని ఆరోపించారు. బ్లాక్ మార్కెట్లోనూ వాటి విక్రయాలు సాగుతున్నాయన్నారు. డెస్ మొయిన్స్లో నిర్వహించిన ‘సేవ్ అమెరికా ర్యాలీ’లో భాగంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పటికే రష్యా, చైనా వద్ద అమెరికాకు చెందిన అధునాతన హెలికాప్టర్ల నమూనాలు ఉన్నాయి. ప్రస్తుతం అపాచీ హెలికాప్టర్లను వారు రీ ఇంజినీరింగ్ చేస్తున్నారు. వాటి విడిభాగాలను అధ్యయనం చేస్తున్నారు. అతి త్వరలోనే వారు తక్కువ డబ్బుతోనే అత్యుత్తమమైన హెలికాప్టర్లను నిర్మిస్తారు’ అని పేర్కొన్నారు.
మూడు శాతం మందే అర్హులు..
ఇటీవల అఫ్గాన్నుంచి అమెరికాకు తరలించినవారిలో కేవలం మూడు శాతం మంది మాత్రమే ఇక్కడికి వచ్చేందుకు అర్హులని ట్రంప్ పేర్కొన్నారు. అసలు ఆ తరలింపు విమానాల్లో ఎవరెక్కుతున్నారో కూడ బలగాలకు తెలియలేదని అన్నారు. అఫ్గాన్నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ తీరుపై మొదటినుంచి జో బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ట్రంప్.. ఈ ప్రక్రియ చాలా అసమర్థంగా జరిగిందని పలుమార్లు ఆరోపించారు. ఇలాంటి దారుణమైన ఉపసంహరణ ప్రక్రియను చరిత్రలో ఏ యుద్ధంలోనూ చూడలేదంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.