Anindita Chatterjee: పిల్లలుంటే ఏమైంది? నెలల పాపతో 10 దేశాలు చుట్టి వచ్చా!
పిల్లలు చిన్నవాళ్లని.. అందుకే విహార యాత్రలకు వెళ్లడం లేదంటూ కొందమంది చెబుతుంటారు. అలాంటి వారికి ముంబయి చెందిన ట్రావెలర్ అనిందిత (Anindita Chatterjee) చేసిన సూచనలేంటో తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ఒక్కొక్కరిది ఒక్కో అభిలాష. కొందరు ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేయడానికి ఇష్టపడితే.. ఇంకొందరు మాత్రం ప్రపంచం (World) చుట్టేసి రావాలనుకుంటారు. అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. దేశ విదేశాల్లో తిరగాలని (Travelling) మనసులో బలంగా కోరిక ఉన్నప్పటికీ పెళ్లి, పిల్లలు అయిన తర్వాత చాలా మంది విహారయాత్రలు చేయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా స్త్రీలకు ఇది వర్తిస్తుంది. పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందేమో? వాళ్లకి ఇబ్బంది కలుగుతుందేమోనని ఎన్నో ఆలోచనలు. వీటన్నింటికీ చెక్ పెడుతున్నారు ముంబయి చెందిన అనిందితా ఛటర్జీ (Anindita Chatterjee).
ఉద్యోగానికి రాజీనామా చేసి..
41 ఏళ్ల అనిందితా ఛటర్జీకి విదేశాల్లో పర్యటించడమంటే మహా సరదా. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు సహకరించేవారు. పెళ్లయిన తర్వాత కూడా భర్తతో కలిసి ఆమె విదేశీ పర్యటనలు కొనసాగించారు. అలా 2017లో @travel.chatter ఇన్స్టాగ్రామ్ పేజీని ప్రారంభించి తన పర్యటన విశేషాలను అందులో పంచుకునే వారు. 2020లో పూర్తిగా ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని ట్రావెలింగ్కే కేటాయించారు. తాను గర్భవతినని తెలిసేసరికి ఆమె మెక్సికోలో ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యలు వెంటనే ఆమెను వెనక్కి వచ్చేయమని చెప్పారు. అయినా ఆమె వినలేదు. పర్యటన పూర్తి చేసుకున్న తర్వాతనే తిరిగి ముంబయికి వచ్చారు.వైద్యుడి సూచన మేరకు కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ విహారయాత్రలు మొదలు పెట్టారు అలా గర్భవతిగా ఉన్నప్పుడే నాలుగు దేశాల్లో పర్యటించారు అనిందిత.
87 దేశాల్లో పర్యటించి..
డెలివరీ అయిన తర్వాత కేవలం 45 రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకున్నారట. పాపకు ఏడాది పూర్తయ్యేసరికి 14 దేశాల్లో పర్యటించి అక్కడి విశేషాలను సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఫాలోవర్లకు చేరవేసేవారు. ఆమె ట్రావెలింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 87 దేశాల్లో పర్యటించారట. ‘‘ ట్రావెలింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. గర్భవతినైతే తప్పేంటి. అందులో వింతేముంది. గర్భవతి అయినంత మాత్రాన మనం నిత్యం చేస్తున్న పనులను ఆపడం లేదు కదా. అందుకే నేను కూడా ట్రావెలింగ్ ఆపలేదు.’’ అంటూ చెప్పుకొచ్చారు అనిందిత. మెక్సికో, కొలంబియా లాంటి ఎన్నో సందర్శనీయ ప్రాంతాల్లో పర్యటించి ఆ విశేషాలను చెప్పుకొచ్చారు. ఆమె ప్రతి రోజూ క్రమం తప్పకుండా కనీసం 10 కిలోమీటర్లు నడుస్తారట.
ఆత్మస్థైర్యం కోల్పోవద్దు..
చిన్న చిన్న కారణాలతో తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని అనిందిత చెబుతున్నారు. మనం మన కలలను నెరవేర్చుకునేందుకు శ్రమించినప్పుడే.. మన పిల్లలు కూడా వాటిని చూస్తూ పెరిగి.. వాళ్ల కలలను సాకారం చేసుకుంటాని ఆమె అంటున్నారు. ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా ముందుగా దాని గురించి పరిశోధన చేసి, అక్కడ చూడదగ్గ విశేషాలేమన్నా ఉన్నాయేమో తెలుసుకున్న తర్వాతనే ట్రిప్ ప్లాన్ చేసుకుంటారట. అయితే పాప పుట్టిన తర్వాత వీలైంత వరకు పగటిపూట ట్రావెల్ చేసేలా షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నామని చెబుతున్నారు. చిన్నారి కూడా తమ ట్రావెలింగ్కు ఎంతో సహకరిస్తోందని, కొత్తవారు ఎదురైతే హాయ్ అంటూ వారిని పలకరిస్తోందని, ఆమె కూడా ట్రిప్ని ఎంజాయ్ చేస్తుండటంతో మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం లేదని అనిందిత వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
నోటా విజేతగా నిలిస్తే?
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?