Covid-19: ప్రజలు అజాగ్రత్తగా వ్యవహరించడం తగదు: కేంద్ర ప్రభుత్వం
ప్రపంచం కోవిడ్-19 మహమ్మారి నాలుగోదశను చూస్తోందని దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మహమ్మారి తీవ్రత...
దిల్లీ: ప్రపంచం కొవిడ్-19 మహమ్మారి నాలుగో దశను చూస్తోందని దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో పాజిటివిటీ రేటు 6.1శాతంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు అజాగ్రత్తగా వ్యవహరించడం తగదని హితవుపలికారు. యూరప్తో పోలిస్తే ఉత్తర అమెరికా, ఆఫ్రికాల్లో ప్రతివారం కేసులు పెరుగుతున్నట్లు తెలిపారు. ఆసియాలో తాజా కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ అలసత్వం తగదన్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల విషయంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నట్లు ప్రకటించారు. ఒమిక్రాన్ కేసుల పెరుగుదల గురించి మాట్లాడుతూ దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 358 కేసులు నమోదుకాగా అందులో 114మంది కోలుకున్నట్లు తెలిపారు. టీకాకు అర్హులైన వారిలో ఇప్పటి వరకు 89శాతం మంది మొదటి డోసు టీకా తీసుకున్నారని, 61 శాతం మంది రెండో డోసు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. రాత్రి కర్ఫ్యూ విధించడం, పెద్ద ఎత్తున బహిరంగ సమావేశాలను నియంత్రించడం, ఆస్పత్రిలో పడకల సామర్థ్యం పెంచడం వంటివి కఠినంగా అమలు చేయాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈనెల 21న రాష్ట్రాలకు ముందస్తుగా సూచించిందని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్కని బెయిల్.. కేంద్ర కారాగారానికి రేవణ్ణ
మహిళ కిడ్నాప్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణను పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి బుధవారం తరలించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ 100 సర్వీసుల రద్దు
టాటా గ్రూప్లోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు ఉద్యోగుల సెగ తగిలింది. -
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
పూంఛ్ వద్ద వాయుసేన కాన్వాయ్పై జరిగిన దాడిలో పాక్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన మాజీ కమాండో ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్