ఎయిరిండియా ఎక్స్ప్రెస్ 100 సర్వీసుల రద్దు
టాటా గ్రూప్లోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు ఉద్యోగుల సెగ తగిలింది.
15,000 మంది ప్రయాణికులకు ఇక్కట్లు
సిబ్బంది మూకుమ్మడి అనారోగ్య సెలవుల ఫలితం
దిల్లీ/కోచి: టాటా గ్రూప్లోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు ఉద్యోగుల సెగ తగిలింది. సీనియర్ క్యాబిన్ సిబ్బందిలో కొంతమంది మూకుమ్మడిగా అనారోగ్య సెలవు పెట్టడంతో, మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు 100కు పైగా విమాన సర్వీసులను సంస్థ రద్దు చేసింది. మరికొన్ని విమానాలు ఆలస్యమయ్యాయి. దీంతో వేర్వేరు విమానాశ్రయాల్లో 15,000 మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు అధిక శాతం ఆగిపోవడం, భద్రతా తనిఖీలు చేయించుకున్నాక.. విమాన సర్వీసు రద్దయిందనే సమాచారాన్ని తెలపడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సమయానికి వెళ్లలేకపోతే, తమ ఉద్యోగాలు పోతాయనే ఆందోళన మధ్యప్రాచ్య ప్రయాణికుల్లో నెలకొంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో విమానాల రద్దుపై సంస్థ నుంచి పౌర విమానయాన శాఖ నివేదిక కోరింది. సమస్యను త్వరగా పరిష్కారించాలనీ ఆదేశించింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం.. ప్రయాణికులకు సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. మార్చి చివరి వారం నుంచి మొదలైన వేసవి షెడ్యూలు కింద రోజుకు 360 విమాన సర్వీసులను ఎయిరిండియా ఎక్స్ప్రెస్ నిర్వహించాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో మే 13 వరకు సర్వీసులను పరిమితంగా నడపాలని సంస్థ నిర్ణయించింది.
కొన్ని రోజులు ఇబ్బందే: సీఈఓ
సిబ్బంది సెలవు కారణంగా కోచి, కాలికట్, దిల్లీ, బెంగళూరు వంటి విమానాశ్రయాల్లో దేశీయ, అంతర్జాతీయ సేవలకు అంతరాయం కలిగిందని తెలుస్తోంది.200 మందికి పైగా క్యాబిన్ సిబ్బంది అనారోగ్య సెలవు (సిక్ లీవ్) పెట్టారని కంపెనీ సీఈఓ ఆలోక్ సింగ్ తెలిపారు.మరికొన్ని రోజులు ఇబ్బందే అన్నారు. 90కి పైగా విమాన సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. ఒక్క దిల్లీలోనే బుధవారం వేకువజామున 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య 14 విమాన సర్వీసులను సంస్థ రద్దు చేసిందని చెప్పారు.
ఎందుకు ఇలా?: కారణాలు తెలుసుకోడానికి సిబ్బందితో చర్చలు జరుపుతున్నట్లు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అసౌకర్యానికి ప్రయాణికులకు క్షమాపణలు తెలిపారు. క్యాబిన్ సిబ్బందిలోని ఒక వర్గం కొంత కాలంగా అసంతృప్తిగా ఉంది. ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో ఏఐఎక్స్ కనెక్ట్ (అంతక్రితం ఎయిరేషియా ఇండియా) విలీన ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి నెలకొంది. ఉద్యోగులతో కంపెనీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని 300 మంది క్యాబిన్ సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఎక్స్ఈయూ) ఆరోపించింది.
టాటా గ్రూప్నకే చెందిన విస్తారాలోనూ: ఒక నెల క్రితం పైలెట్ల సెలవులతో.. టాటా గ్రూప్నకే చెందిన విస్తారా తన రోజువారీ విమాన సర్వీసుల సంఖ్యను 25-30% తగ్గించుకున్న సంగతి తెలిసిందే. విమానయాన వ్యాపార స్థిరీకరణ నిమిత్తం ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదో విడతలో జోరెవరిదో!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. -
మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. -
సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత
పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. -
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. -
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు రేగాయి. -
అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్ ఖలీ’ ముచ్చట్లు
‘ది గ్రేట్ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ దలీప్ సింగ్ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. -
పుదుచ్చేరి బీచ్లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన
చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్లో స్నానాలు నిషేధించింది. -
అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు
రాజస్థాన్లోని భరత్పుర్ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. -
డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాజధాని నగరం రాయ్పుర్ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. -
విశ్వ మానవులం!
ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. -
రాజకీయాలకు మేం అతీతం
సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. -
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.