Bhavadeeyudu Bhagat Singh: ‘భవదీయుడు..’ కోసం పంకజ్‌?

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. ఈ  సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠిని

Published : 19 Mar 2022 14:27 IST

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. ఈ  సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠిని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ‘మీర్జాపూర్‌’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడాయన. ఇప్పుడీ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని