ట్విటర్లో మోత మోగించిన ఐదు సినిమాలు..
ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులకు ప్రచారం ఎంత ముఖ్యమో.. విడుదలకు ముందు సినిమాలకు ప్రమోషన్ అంతే ముఖ్యం. ప్రచారమైనా.. ప్రమోషనైనా సీటు కోసమే. ప్రచారం విజయవంతమైతే నాయకుడికి సీటులో కూర్చోబెడుతుంది.
కారణాలేంటో తెలుసా..?
ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులకు ప్రచారం ఎంత ముఖ్యమో.. విడుదలకు ముందు సినిమాలకు ప్రమోషన్ అంతే ముఖ్యం. ప్రచారమైనా.. ప్రమోషనైనా సీటు కోసమే. ప్రచారం విజయవంతమైతే నాయకుడిని సీటులో కూర్చోబెడుతుంది. ప్రమోషన్ సక్సెస్ అయితే ప్రేక్షకుడిని సీటులో కూర్చునేలా చేస్తుంది. అయితే.. ప్రమోషన్ సక్సెస్ కావాలంటే అది ప్రేక్షకులను ఆకట్టుకునే అంశమయ్యుండాలి.. లేదా అంతర్యుద్ధం సృష్టించేలా ఉంది అనిపించేలా ఉండాలి. అప్పుడే సినిమా ప్రేక్షకుల నోళ్లలో నానుతుంది. నిజానికి సినిమా సాధించే తొలివిజయం అదే. మరి అచ్చం అలాగే.. వివాదాలతో కొన్ని సినిమాలు సోషల్ మీడియాలో మార్మోగిపోయాయి. అలా.. ఈ ఏడాది ట్విటర్లో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిన టాప్5 బాలీవుడ్ సినిమాలేంటి..? అందుకు గల కారణాలేంటో తెలుసా..?
* దిల్ బెచారా.. సుశాంత్ మరణం
ఈ సంవత్సరం ట్విటర్లో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిన చిత్రం ‘దిల్ బెచారా’. సుశాంత్సింగ్ రాజ్పుత్ చివరి సినిమా కావడంతో ఈ సినిమా గురించి చాలామంది ట్వీట్లు చేశారు. 2014లో రొమాంటిక్ డ్రామాగా వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’కు రిమేక్గా ‘దిల్ బెచారా’ను తెరకెక్కించారు. ఇద్దరు కేన్సర్ బాధితుల మధ్య సాగే ప్రేమ కథ ఇది. ఈ సినిమా విడుదల కాకముందే.. సుశాంత్ జూన్ 14న ముంబైలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘ఆత్మహత్య తప్పు’ అని చెప్పిన హీరో సుశాంత్ నిజజీవితంలో ఆత్మహత్యకు పాల్పడటంతో సినిమాపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఈ సినిమాకు ముకేశ్ చబ్బా దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఓటీటీలో జులై 24న ఈ చిత్రం విడుదలైంది.
* ఛపాక్.. జేఎన్యూ సందర్శన
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో అంతగా సఫలం కాకపోయినా.. విమర్శకుల నుంచి ప్రసంశలు అందుకున్న చిత్రం ‘ఛపాక్’. విడుదలకు ముందే ఈ చిత్రం కూడా ట్విటర్లో ఎక్కువగా కనిపించింది. అయితే.. అందులో వ్యతిరేక పోస్టులే ఎక్కువ. కారణం.. ఈ సినిమా హీరోయిన్ దీపికా పదుకొణె జనవరిలో జరిగిన జేఎన్యూ ఘటనలో జోక్యం చేసుకోవడం. ఆమె యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులకు మద్దతు తెలిపింది. అయితే.. ఇదంతా తన సినిమా ప్రమోషన్ కోసం దీపిక చేస్తున్న పబ్లిక్స్టంట్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాదు.. ‘బాయ్కాట్ఛపాక్’ అనే హ్యాష్ట్యాగ్ చాలా రోజులు ట్రెండింగ్లో కొనసాగింది. అలా.. ఈ సినిమా ఎక్కువగా ట్విటర్లో ప్రస్తావనకు వచ్చింది. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను మేఘా గుల్జర్ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరి 10న చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
* తానాజీ.. నిజాన్ని దాచిపెట్టారని
ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి తానాజీ మొఘల్ సామ్రాజ్యంపై చేసే మెరుపుదాడుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘తానాజీ: ది అన్సంగ్ వారియర్’. ఈ సినిమాలో తానాజీ పాత్రలో అజయ్ దేవ్గణ్తో పాటు మరో పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. అయితే.. ఈ సినిమాలో తానాజీ వాస్తవ చరిత్రను దాచిపెట్టారని అఖిల భారతీయ క్షత్రి కోలి రాజ్పుత్ సంఘం సినిమా నిర్మాతలపై ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన నటుడు సైఫ్ అలీఖాన్.. సినిమా రాజకీయాలు చాలా ప్రమాదకరమైనవని పేర్కొన్నారు. ఇలా.. ఈ సినిమా కూడా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ.. ట్రెండింగ్లో నిలిచింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా కూడా జనవరి 10నే విడుదలైంది.
* థప్పడ్.. స్త్రీ-పురుష వాదుల చర్చ
పురుష అహంకార ధోరణిపై చెంపపెట్టు ‘థప్పడ్’. అనుభవ్సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సొట్టబుగ్గల సుందరి తాప్సీ ప్రధానపాత్ర పోషించింది. ఈ చిత్రంలో తన నటనతో మంచి మార్కులు సంపాదించుకుంది. అందరి ముందు భార్యపై భర్త చేయిచేసుకోవడం సరైందేనా అనే చిన్న లాజిక్తో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే.. ‘చెంప దెబ్బ కారణంగా విడాకులు తీసుకోవాలనుకోవడం ఏంటి..? భార్యభర్తలంటేనే సర్దుకుపోవడం చిన్నచిన్నవాటిని కూడా హింసగా చిత్రీకరిస్తే ఎలా..?’ అని కొంతమంది.. ‘లేదులేదు.. మగవాళ్లతో పాటు స్త్రీలకు కూడా గౌరవమర్యాదలు ఉంటాయి. అలాంటప్పుడు ఆడవాళ్లు ఎందుకు తలొగ్గి ఉండాలి’ అని మరికొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇలా.. ఈ సినిమా ట్విటర్లో కొంతకాలం పాటు చర్చకు దారితీసింది. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో తాప్సీకి జోడీగా పావిల్ గులాటి కనిపించారు.
* గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాల్.. ఎయిర్ఫోర్సు ఫిర్యాదు
యుద్ధంలో పాల్గొన్న తొలి భారత మహిళా పైలట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘గుంజన్ సక్సేనా’. కరణ్శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో పైలట్గా కనిపించింది. ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే.. ఈ సినిమాలో ఓ ఎయిర్ఫోర్స్ అధికారి చెప్పే ‘ఇది ఆడవాళ్ల కోసం ఉద్దేశించిన ప్రదేశం కాదు’ డైలాగ్ వివాదానికి దారి తీసింది. సినిమాలో ఆ మహిళా పైలట్ పాత్రను ఉద్దేశిస్తూ.. ‘భారత వైమానిక దళంలో చాలా మంది మహిళా అధికారులు ఉన్నారు’ అని ఆయన ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారి పేర్కొన్నారు. సినిమా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, నెట్ఫ్లిక్స్కు లేఖ రాశారు. అంతేకాదు.. కొంతమంది సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్లు చేశారు. ఇలా ఈ సినిమా ట్విటర్లో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిన టాప్5 సినిమాల జాబితాలో చోటు సంపాదించింది. ఇలా.. పెద్ద ఎత్తున వివాదాలతో మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 12న విడుదలైంది.
- ఇంటర్నెట్ డెస్క్
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్