కసబ్‌పై సినిమాకు ఓకే చెప్పిన సుశాంత్‌..!

ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సినిమా ఏంటి..? అంటే ‘దిల్‌ బెచారా’ అని ఎవరైనా చెప్తారు. కానీ.. సుశాంత్‌ దాని తర్వాత ఇంకో సినిమాకు కూడా ఓకే చెప్పాడట. ముంబయి 26/11 ఉగ్రదాడికి పాల్పడ్డ పాకిస్థాన్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ చరిత్ర ఆధారంగా

Published : 20 Nov 2020 01:34 IST

ముంబయి: ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సినిమా ఏంటి..? అంటే ‘దిల్‌ బెచారా’ అని ఎవరైనా చెప్తారు. కానీ.. సుశాంత్‌ దాని తర్వాత ఇంకో సినిమాకు కూడా ఓకే చెప్పాడట. ముంబయి 26/11 ఉగ్రదాడికి పాల్పడ్డ పాకిస్థాన్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ చరిత్ర ఆధారంగా తెరకెక్కాల్సిన సినిమానట అది. ఆ దాడి చేసిన కసబ్‌ను భారత ప్రభుత్వం ఉరితీసిన విషయం అందరికీ తెలిసిందే. జూన్‌ 13న సుశాంత్‌ ఈ సినిమా గురించి చర్చలు జరిపినట్లు ఇండియాటుడే విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది.
దీనికి సంబంధించి కార్నర్‌స్టోన్‌ ఎల్ఎల్‌పీకి చెందిన ఉదయ్‌సింగ్‌ గౌరీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారట. ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రోజు సుశాంత్‌కు ఉదయ్‌సింగ్‌ ఫోన్‌ చేశాడు. అంతేకాదు.. సినిమా డైరెక్టర్‌ నిఖిల్‌ అడ్వాణీ, నిర్మాత రమేశ్‌ తౌరాణీని కాన్ఫరెన్సులో కలిపాడు. ఏడు నిమిషాల పాటు ఆ ముగ్గురితో సుశాంత్‌ సినిమా గురించి చర్చించినట్లు తెలుస్తోంది. గౌరీ కాల్‌ రికార్డులు పరిశీలించిన తర్వాత.. అతను సుషాంత్‌కు ఐదుసార్లు ఫోన్‌ చేసినట్లు తేలింది. కరోనా వైరస్.. లాక్‌డౌన్‌ కారణంగా నేరుగా కలుసుకోవడం కుదరదని వాళ్లు.. ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు తెలిసింది. వీళ్లు ఫోన్‌ మాట్లాడుకున్న తర్వాతి రోజు జూన్ 14న సుశాంత్ మరణించడంతో ఈ ప్రాజెక్టుకు బ్రేక్‌ పడింది. ఈ కేసు దేశంలో దుమారం రేపింది. ఈ కేసు విచారణలో ఉండగానే డ్రగ్స్‌ కోణం బయటపడింది. దీంతో చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని