కసబ్పై సినిమాకు ఓకే చెప్పిన సుశాంత్..!
ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సినిమా ఏంటి..? అంటే ‘దిల్ బెచారా’ అని ఎవరైనా చెప్తారు. కానీ.. సుశాంత్ దాని తర్వాత ఇంకో సినిమాకు కూడా ఓకే చెప్పాడట. ముంబయి 26/11 ఉగ్రదాడికి పాల్పడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ చరిత్ర ఆధారంగా
ముంబయి: ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సినిమా ఏంటి..? అంటే ‘దిల్ బెచారా’ అని ఎవరైనా చెప్తారు. కానీ.. సుశాంత్ దాని తర్వాత ఇంకో సినిమాకు కూడా ఓకే చెప్పాడట. ముంబయి 26/11 ఉగ్రదాడికి పాల్పడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ చరిత్ర ఆధారంగా తెరకెక్కాల్సిన సినిమానట అది. ఆ దాడి చేసిన కసబ్ను భారత ప్రభుత్వం ఉరితీసిన విషయం అందరికీ తెలిసిందే. జూన్ 13న సుశాంత్ ఈ సినిమా గురించి చర్చలు జరిపినట్లు ఇండియాటుడే విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది.
దీనికి సంబంధించి కార్నర్స్టోన్ ఎల్ఎల్పీకి చెందిన ఉదయ్సింగ్ గౌరీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారట. ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రోజు సుశాంత్కు ఉదయ్సింగ్ ఫోన్ చేశాడు. అంతేకాదు.. సినిమా డైరెక్టర్ నిఖిల్ అడ్వాణీ, నిర్మాత రమేశ్ తౌరాణీని కాన్ఫరెన్సులో కలిపాడు. ఏడు నిమిషాల పాటు ఆ ముగ్గురితో సుశాంత్ సినిమా గురించి చర్చించినట్లు తెలుస్తోంది. గౌరీ కాల్ రికార్డులు పరిశీలించిన తర్వాత.. అతను సుషాంత్కు ఐదుసార్లు ఫోన్ చేసినట్లు తేలింది. కరోనా వైరస్.. లాక్డౌన్ కారణంగా నేరుగా కలుసుకోవడం కుదరదని వాళ్లు.. ఫోన్లో మాట్లాడుకున్నట్లు తెలిసింది. వీళ్లు ఫోన్ మాట్లాడుకున్న తర్వాతి రోజు జూన్ 14న సుశాంత్ మరణించడంతో ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. ఈ కేసు దేశంలో దుమారం రేపింది. ఈ కేసు విచారణలో ఉండగానే డ్రగ్స్ కోణం బయటపడింది. దీంతో చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM