అడిగా... జతగా

బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత.

Updated : 19 Sep 2021 07:40 IST

బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. అందులో భాగంగా తొలి పాటని శనివారం విడుదల చేశారు. ‘అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా... జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా...’ అంటూ సాగే ఆ పాటని తమన్‌ స్వరకల్పనలో ఎస్పీ చరణ్‌, ఎం.ఎల్‌.శ్రుతి ఆలపించారు. కల్యాణ్‌ చక్రవర్తి సాహిత్యం సమకూర్చారు. ‘‘బాలకృష్ణ, ప్రగ్యా జోడీ తెరపై మేజిక్‌ చేయనున్నట్టు స్పష్టమవుతోంది. బోయపాటి శ్రీను సినిమాల్లో మంచి మెలోడీలు ఉంటాయి. అందులో ఈ పాటా చేరుతుంద’’న్నాయి సినీ వర్గాలు. పూర్ణ, జగపతిబాబు, శ్రీకాంత్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ  చిత్రానికి ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని