‘లవ్స్టోరి’ మరో ‘ప్రేమనగర్’
‘‘నటుడు.. స్టార్ ఇవి రెండూ భిన్నమైన పదాలు. చైతన్యని శేఖర్ కమ్ముల ఒక స్టార్ నటుడిగా మార్చార’’న్నారు ప్రముఖ కథానాయకుడు నాగార్జున. మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా ‘లవ్స్టోరి’ విజయోత్సవ వేడుక జరిగింది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది.
‘‘నటుడు.. స్టార్ ఇవి రెండూ భిన్నమైన పదాలు. చైతన్యని శేఖర్ కమ్ముల ఒక స్టార్ నటుడిగా మార్చార’’న్నారు ప్రముఖ కథానాయకుడు నాగార్జున. మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా ‘లవ్స్టోరి’ విజయోత్సవ వేడుక జరిగింది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. నారాయణ్దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మాతలు. వేడుకని ఉద్దేశించి నాగార్జున మాట్లాడుతూ ‘‘ప్రేమనగర్’ విడుదలై యాభై ఏళ్లయ్యింది. నాన్న కెరీర్లో పెద్ద విజయం సాధించిన ఆ సినిమా విడుదల రోజునే ‘లవ్స్టోరి’ విడుదలైంది. అప్పట్లో కూడా ఇలాగే తుఫాన్ వచ్చింది. ఈసారి కొవిడ్, తుఫాన్ వచ్చినా ‘లవ్స్టోరి’ ఘన విజయం సాధించి, మరో ‘ప్రేమనగర్’ అయ్యింది. ఈ సినిమా విజయంతో ప్రతి దర్శకనిర్మాత సంబరాలు చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ మమ్మల్ని మంచి చూపుతో చూశాయి. తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎంతగానో ప్రేమిస్తారు. అలా మా అందరినీ చల్లని చూపు చూసి మీ దీవెనలు ఇవ్వండని కోరుతున్నాం’’ అన్నారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ప్రయాణంలో చాలా ఒత్తిళ్లు ఎదుర్కొన్నాం. నిర్మాతలు నిరంతరంగా మాతో ఉంటూ మనం థియేటర్కి వెళ్లాల్సిందే అన్నారు. చిరంజీవి సర్ మొదలుకొని చాలా మంది మాకు అండగా నిలిచార’’న్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ‘‘నా సినిమాలు విడుదలై రెండేళ్లయింది. ‘లవ్స్టోరి’ విడుదలైన రోజు చాలా మేజికల్గా అనిపించింది. ముందు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాల’’న్నారు. కార్యక్రమంలో కె.ఎస్.రామారావు, నిర్మాత నారాయణ్దాస్ నారంగ్, డి.సురేష్బాబు, సుద్దాల అశోక్తేజ్, సంగీత దర్శకుడు పవన్ సీహెచ్, మాస్టర్ భాను ప్రకాశ్, బేబీ త్రిషాల తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్