Enemy: వాళ్ల బాధ్యత నాది : విశాల్
‘‘పునీత్ రాజ్కుమార్ మంచి నటుడే కాదు.. గొప్ప మనిషి కూడా. ఓ ప్రభుత్వం చేయాల్సిన పనిని ఆయన చేశారు. 1800 మంది పిల్లల్ని చదివిస్తున్నారు. పునీత్ స్నేహితుడిగా ఇప్పుడు ఆయనకు నేను
‘‘పునీత్ రాజ్కుమార్ మంచి నటుడే కాదు.. గొప్ప మనిషి కూడా. ఓ ప్రభుత్వం చేయాల్సిన పనిని ఆయన చేశారు. 1800 మంది పిల్లల్ని చదివిస్తున్నారు. పునీత్ స్నేహితుడిగా ఇప్పుడు ఆయనకు నేను చేయగలిగేది ఒకటే. ఇకపై ఆ 1800 మంది పిల్లల బాధ్యతను నేనే తీసుకుంటాను. వారికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను’’ అన్నారు హీరో విశాల్. ఆయన, హీరో ఆర్య కలిసి నటించిన చిత్రం ‘ఎనిమి’. ఆనంద్ శంకర్ తెరకెక్కించారు. ఎస్.వినోద్ నిర్మించారు. మమతా మోహన్దాస్, మృణాళిని కథానాయికలు. ఈ సినిమా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ‘‘వినోద్ లేకుంటే ఈ ‘ఎనిమి’ లేదు. తను కథ చెప్పినప్పుడే మరో పాత్ర ఆర్య చేస్తేనే బాగుంటుందని అనుకున్నా. ఇదొక విభిన్నమైన యాక్షన్ సినిమా. చాలా బాగా వచ్చింది. సినిమాలో నాది మృణాళిని కెమిస్ట్రీ కన్నా.. నాది ఆర్యలదే బాగా వచ్చింది. థియేటర్లలో సినిమా చూడండి. కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘మంచి స్టోరీ ఇది. ఎమోషన్స్ ఉన్నాయి. ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరం. ‘వాడు వీడు’ తర్వాత మళ్లీ ఇలా ఈ చిత్రంతో విశాల్తో కలిసి నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు ఆర్య. దర్శకుడు ఆనంద్ మాట్లాడుతూ ‘‘ఇది చక్కటి వాణిజ్య చిత్రం. అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రం కోసం ఆర్య, విశాల్ కలిసి నటించేందుకు ముందుకు రావడం చాలా గ్రేట్. యాక్షన్ సీక్వెన్స్లో ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు’’ అన్నారు. ‘‘కొవిడ్ పరిస్థితుల వల్ల దుబాయ్లో షూట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఫస్ట్లుక్ విడుదలైనప్పటి నుంచి అండగా నిలుస్తున్న అందరికీ థ్యాంక్స్’’ అన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో మమతా మోహన్దాస్, మృణాళిని తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త జోడీ... మెరుపులు రెడీ
ఒకసారి హిట్ అనిపించుకుంటే చాలు.. మళ్లీ మళ్లీ ఆ జోడీని తెరపై చూడడానికి ఇష్టపడతారు సినీప్రియులు. దీంతో పాటు తెరపైకి కొత్త కాంబినేషన్లు వస్తున్నాయంటే కూడా అభిమానుల్లో ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది. -
టాక్సిక్ కోసం బరిలోకి నయనతార
‘కేజీఎఫ్’ సిరీస్ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
గరం గరం యముడు
‘‘మామూలుగా నాటు అయినా నీటు.. ఎరగడు తడబాటు. మాసు..క్లాసుల మధ్యన ఊగుట వీడికి అలవాటు’’ అంటూ తన వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తున్నాడు సూర్య. -
‘పుష్ప 2’ తేదీకే ‘డబుల్ ఇస్మార్ట్’
‘డబుల్ ఇస్మార్ట్’ విడుదల ఖరారైంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లుగానే ‘పుష్ప 2’ విడుదల తేదీనే ఈ పాన్ ఇండియా చిత్రం లక్ష్యం చేసుకుంది. -
సింగమ్ మళ్లీ వస్తున్నా... ఆలస్యంగానే!
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో.. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సింగమ్ అగైన్’. అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఈ చిత్రంలో పాత్రల ముఖాలు కనిపించవు!
సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా బి.శివప్రసాద్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఏ’.. ఈతరం ప్రేక్షకుల్నీ షాక్కు గురిచేస్తుంది
ఉపేంద్ర కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘ఏ’. ఈ సినిమా ఈ నెల 21న తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ కానుంది. -
స్టైలిష్ తాప్సీ.. హాట్ దక్ష.. క్యూట్ అదితి
ఇన్స్టా వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ దళాలకు ఎదురుదెబ్బ.. 8 మంది సైనికులు మృతి
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/06/24)
-
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
-
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!