Aadi Saikumar: ఈ విజయం అందరిది

‘‘మంచి సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారని మా ‘క్రేజీ ఫెలో’తో మరోసారి నిరూపితమైంద’’న్నారు దర్శకుడు ఫణికృష్ణ సిరికి. ఇది ఆయన తెరకెక్కించిన తొలి సినిమా. ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నటించారు. కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. దిగంగన సూర్యవంశి, మిర్నా మేనన్‌ కథానాయికలు.

Updated : 07 Dec 2022 16:27 IST

‘‘మంచి సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారని మా ‘క్రేజీ ఫెలో’తో (Crazy Fellow) మరోసారి నిరూపితమైంద’’న్నారు దర్శకుడు ఫణికృష్ణ సిరికి. ఇది ఆయన తెరకెక్కించిన తొలి సినిమా. ఆది సాయికుమార్‌ (Aadi Saikumar) కథానాయకుడిగా నటించారు. కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. దిగంగన సూర్యవంశి, మిర్నా మేనన్‌ కథానాయికలు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమాకి అన్ని చోట్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. మౌత్‌ టాక్‌ అద్భుతంగా ఉంది. ఫణి ఈ కథని చాలా ప్రేమించి సినిమాగా మలిచారు. ఒక మంచి సినిమా చేశాం. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రం కోసం పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు చిత్ర దర్శకుడు. నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ విజయం అందరిది. సమష్టి కృషి వల్లే సాధ్యమైంది. ప్రేక్షకుల అభిమానం పొందడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో ఆదికి సక్సెస్‌ వచ్చినందుకు సంతోషపడుతున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దిగంగన, మిర్నా, నర్రా శ్రీనివాస్‌, సతీష్‌ ముత్యాల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని