Vidya vasula aham: ఓటీటీలోకి నేరుగా ‘విద్యా వాసుల అహం’

రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా మణికాంత్‌ గెల్లి తెరకెక్కించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’. మహేశ్‌ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి సంయుక్తంగా నిర్మించారు.

Updated : 07 May 2024 09:36 IST

రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా మణికాంత్‌ గెల్లి తెరకెక్కించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’. మహేశ్‌ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి సంయుక్తంగా నిర్మించారు. అవసరాల శ్రీనివాస్‌, శ్రీనివాస్‌ రెడ్డి, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానుంది. ‘‘ఈ రోజుల్లో పెళ్లైన జంటల మధ్య ప్రేమతో పాటు అహం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఆ నేపథ్యంతోనే ఈ సినిమాని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు దర్శకుడు మహేశ్‌. ఇది ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: కల్యాని మాలిక్‌, ఛాయాగ్రహణం: అఖిల్‌ వల్లూరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని