KGF 2: ‘కేజీయఫ్2’ టీమ్కు ఆమీర్ఖాన్ క్షమాపణలు.. రాఖీభాయ్కి ప్రచారం చేస్తా!
తనని ‘పర్ఫెక్ట్ మ్యాన్’ అని ఎందుకు అంటారో మరోసారి నిరూపించారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమీర్ఖాన్. ఆయన
ఇంటర్నెట్డెస్క్: తనని ‘పర్ఫెక్ట్ మ్యాన్’ అని ఎందుకు అంటారో మరోసారి నిరూపించారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమీర్ఖాన్. ఆయన కథానాయకుడిగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్సింగ్ చద్దా’. కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 14, 2022న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. అయితే, అంతకు ముందే అదే రోజున తమ సినిమాను విడుదల చేయనున్నట్లు ‘కేజీయఫ్2’ చిత్ర బృందం కూడా ప్రకటించింది. ప్రశాంత్నీల్ దర్శకత్వంలో యశ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘కేజీయఫ్2’ పైనా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో రెండు భారీ చిత్రాలు ఒకే రోజున విడుదలైతే బాక్సాఫీస్ వసూళ్లను షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆమీర్ఖాన్ మాట్లాడుతూ.. ‘కేజీయఫ్2’ చిత్ర బృందానికి క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు.
‘‘లాల్సింగ్ చద్దా’ బైసఖి రోజున(ఏప్రిల్ 14)న రావటం సరైన నిర్ణయమే. అయితే, మరో పెద్ద సినిమా నిర్మాత విడుదల తేదీని ప్రకటించారని తెలిసి కావాలనే మేము ఆ రోజును ఎంచుకోలేదు. బైసఖి రోజు సినిమాను తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. విడుదల తేదీని ప్రకటించే ముందు ‘కేజీయఫ్2’ నిర్మాత విజయ్ కిరంగదుర్, దర్శకుడు ప్రశాంత్ నీల్, కథానాయకుడు యశ్లకు క్షమాపణ చెబుతూ, నా పరిస్థితి వివరిస్తూ లేఖరాశా. నిర్మాత పాలిట లాక్డౌన్ ఎలాంటి క్లిష్ట పరిస్థితిని తీసుకొచ్చిందో చెప్పా. వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. మా నిర్ణయానికి మద్దతు తెలిపారు. వారి సానుకూల ధోరణికి చాలా సంతోషంగా అనిపించింది’’ అని ఆమీర్ చెప్పుకొచ్చారు.
ఇక ‘కేజీయఫ్’ సినిమాకు తాను అభిమానినని ఈ విషయమై యశ్కు ఫోన్ చేసి మాట్లాడినట్లు ఆమీర్ తెలిపారు. ‘‘యశ్తో ఫోన్లో మాట్లాడా. మా ఇద్దరి మధ్య ఎంతో చక్కని సంభాషణ జరిగింది. ‘కేజీయఫ్’కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే అదొక బ్రాండ్ అయిపోయింది. ప్రేక్షకులు సీక్వెల్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. ‘కేజీయఫ్2’, ‘లాల్ సింగ్ చద్దా’ రెండు వేర్వేరు జోనర్లకు సంబంధించి చిత్రాలు. ప్రేక్షకులు రెండింటినీ ఆదరిస్తారు. ‘కేజీయఫ్2’కు నేనే స్వయంగా ప్రచారం చేస్తా. లక్షలాది అభిమానుల మాదిరిగానే నేను కూడా ‘కేజీయఫ్’కు అభిమానిని. ఏప్రిల్ 14న తప్పకుండా ఆ సినిమాను థియేటర్లో చూస్తా’’ అని యశ్తో ఆమీర్ అన్నారట. మరి ఏప్రిల్ 14న ఈ రెండు సినిమాలే వస్తాయా? లేక ఇంకేదైనా బరిలోకి వస్తుందా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్