Chitram Choodara ott: నేరుగా ఓటీటీలోకి వరుణ్‌ సందేష్‌ కొత్త మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

వరుణ్ సందేష్‌ నటించని క్రైమ్‌ సస్పెన్స్‌ డ్రామా ‘చిత్రం చూడర’ నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

Published : 06 May 2024 20:42 IST

హైదరాబాద్‌: వరుణ్ సందేష్‌ కీలక పాత్రలో నటించిన క్రైమ్‌ సస్పెన్స్ డ్రామా ‘చిత్రం చూడర..’ (Chitram Choodara). ఆర్‌ఎన్‌ హర్షవర్థన్‌ దర్శకుడు. శీతల్‌ భట్‌ కథానాయిక. ధనరాజ్, కాశీ విశ్వనాథ్, రవిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొన్ని నెలల కిందటే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో (ETV Win) మే 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈటీవీ విన్‌ పోస్టర్‌ను పంచుకుంది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీని తొలుత థియేటర్‌లో విడుదల చేయాలని భావించారు. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బీఎం సినిమాస్ పతాకంపై శేషు మారంరెడ్డి, భాగ్యలక్ష్మీ బోయపాటి నిర్మించారు. రథన్‌ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవిబాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సామాన్య యువకుడి పాత్రలో వరుణ్ సందేశ్ సందడి చేయబోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని