Aavesham ott release: మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
హైదరాబాద్: ఇటీవల కాలంలో పలు మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. కొన్ని చిత్రాలు అక్కడి థియేటర్లలో విడుదలైన తర్వాత ఇతర భాషల్లో అనువాదం అవుతుండగా, మరికొన్ని నేరుగా ఓటీటీలో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో తాజా సంచలనం ‘ఆవేశం’ (Aavesham ott release) వచ్చి చేరింది. ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) కీలక పాత్రలో జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కేవలం రూ.30 కోట్లతో నిర్మించిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా రూ.150కోట్లు వసూలు చేసింది. త్వరలోనే ఓటీటీలోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇంతకీ ఈ సినిమాలో ఏముంది?
అజు, బిబి, శంతన్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదవడానికి కేరళ నుంచి బెంగళూరుకు వస్తారు. కాలేజ్ హాస్టల్లో కన్నా బయట ఉంటే కాస్త స్వేచ్ఛగా ఉండవచ్చని బీకే హాస్టల్లో దిగుతారు. ఈ క్రమంలోనే సీనియర్లు అయిన కుట్టీ, అతడి గ్యాంగ్ ఈ ముగ్గురిని దారుణంగా ర్యాగింగ్ చేస్తుంది. దీంతో ‘ఆవేశం’తో రగిలిపోయి, తమ సీనియర్లను కొట్టించడానికి స్థానికంగా గ్యాంగ్స్టర్ అయిన రంజిత్ గంగాధర్ అలియాస్ రంగా (ఫహద్ ఫాజిల్)ను ఆశ్రయిస్తారు. రంగా ఆ సీనియర్స్కు బుద్ధి చెబుతాడు. అయితే, అప్పటి నుంచి అజు, బిబి, శంతనులపై రంగా మనుషులనే ముద్ర పడుతుంది. కాలేజీలోనూ రంగా పేరు చెప్పి, తమ హవా చూపిస్తుంటారు. దీంతో చదువు పక్కకు వెళ్లిపోతుంది. ఓ దశ దాటిన తర్వాత ఈ ముగ్గురూ రంగాను చంపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి అప్పుడు వాళ్లు తీసుకున్న నిర్ణయం ఏంటి? రంగాకు ఈ విషయం ఎలా తెలిసింది? అన్న ఆసక్తికర అంశాలతో సినిమా సాగుతుంది.
‘రొమాంచమ్’ వంటి సింపుల్ కథను తీసిన జీతూ మాధవన్ ‘ఆవేశం’ మూవీని రేసీ స్క్రీన్ప్లేతో అదరగొట్టేశాడు. సినిమాలో ఫహద్ ఫాజిల్ తప్ప ఇతర నటుల గురించి పెద్దగా తెలియకపోయినా తమ నటనతో వాళ్లు కూడా సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చారు. ఇక ఫహద్ ఫాజిల్ ‘పుష్ప: ది రూల్’తో తెలుగువారిని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతోపాటు రజనీకాంత్ ‘వేట్టయాన్’లోనూ ఆయన నటిస్తున్నారు.
నెల రోజులు తిరగకుండానే ఓటీటీలో..
‘ఆవేశం’ మూవీ ఏప్రిల్ 11న మలయాళంలో విడుదలైంది. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియో 28 రోజులకే స్ట్రీమింగ్కు తీసుకొచ్చేస్తోంది. నెల రోజులు తిరగకుండానే ఓటీటీలో వచ్చేస్తున్నా, మాలీవుడ్లో కలెక్షన్ల విషయంలో రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన, ‘2018’, ‘పులి మురుగన్’, ‘ఆడు జీవితం’, ‘బాహుబలి-2’, ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రాల సరసన చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ప్రసన్నవదనం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
సుహాస్ హీరోగా నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. -
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
‘కృష్ణమ్మ’ సినిమా సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఈటీవీ విన్’లో ‘మాయా పేటిక’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పాయల్ రాజ్పుత్, సిమ్రత్ కౌర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాయా పేటిక’ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. -
ఓటీటీలోకి ‘షరతులు వర్తిస్తాయి!’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘షరతులు వర్తిస్తాయి!’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఏ ఓటీటీలో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే? -
‘విద్యా వాసుల అహం’ నేరుగా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
‘విద్యా వాసుల అహం’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఎప్పుడంటే? -
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
విక్కీ కౌశల్, సారా అలీఖాన్ కీలక పాత్రల్లో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ‘జర హట్కే జర బచ్కే’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్ సందర్భంగా రాజమౌళి ప్రత్యేక సందేశమిచ్చారు. -
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అదాశర్మ కీలక పాత్రలో నటించిన ‘బస్తర్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తామని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. -
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
2024లో వరుస హిట్స్తో మలయాళ చిత్ర పరిశ్రమ కళకళలాడిపోతోంది. కేవలం హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన పలు చిత్రాలు రూ.100 కోట్ల క్లబ్లోనూ చేరాయి. ఇప్పటివరకూ ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకున్న టాప్-5 మలయాళీ చిత్రాలేంటో చూసేయండి. -
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. -
నేరుగా ఓటీటీలోకి వరుణ్ సందేష్ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుణ్ సందేష్ నటించని క్రైమ్ సస్పెన్స్ డ్రామా ‘చిత్రం చూడర’ నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
త్రిగుణ్ కీలక పాత్రలో నటించిన ‘లైన్ మ్యాన్’ మూవీ ప్రస్తుతం తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది -
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మాధవన్ నెగెటివ్ షేడ్స్లో నటించిన ‘షైతాన్’ ఓటీటీలోకి రానుంది. -
‘పంచాయత్ సీజన్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
‘పంచాయత్ సీజన్ 3’ వెబ్సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే? -
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. -
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కొత్తదనం నిండిన రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మమితా బైజు నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ప్రణయ విలాసం’. ఈటీవీ విన్ వేదికగా ఇది ప్రసారం కానుంది.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం