Rajashekar: నా ప్రయాణంలో నిలిచిపోయే ‘శేఖర్’
పడి లేచిన కెరటం రాజశేఖర్. తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకుని మళ్లీ కెమెరా ముందుకు అడుగుపెట్టారు. ఎప్పట్లాగే అదే ఉత్సాహంతో కొత్త చిత్రాన్ని పూర్తి చేశారు. రీమేక్ సినిమాలతో తిరుగులేని విజయాల్ని అందుకున్న ఆయన మరోసారి ‘శేఖర్’తో ఆ ప్రయత్నం చేశారు.
పడి లేచిన కెరటం రాజశేఖర్. తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకుని మళ్లీ కెమెరా ముందుకు అడుగుపెట్టారు. ఎప్పట్లాగే అదే ఉత్సాహంతో కొత్త చిత్రాన్ని పూర్తి చేశారు. రీమేక్ సినిమాలతో తిరుగులేని విజయాల్ని అందుకున్న ఆయన మరోసారి ‘శేఖర్’తో ఆ ప్రయత్నం చేశారు. జీవిత దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రాజశేఖర్ గురువారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
ఈ కథని ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణమేదైనా ఉందా?
నేను చేసిన రీమేక్ సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ‘శేషు’ విషయంలోనే ఇమేజ్ పరంగా సమస్యలు రావడంతో అంత పెద్ద విజయం సాధించలేకపోయింది. తలంబ్రాలు, అంకుశం, ఆహుతి, మగాడు, మా అన్నయ్య, సింహరాశి, మా ఆయన బంగారం... నా కెరీర్లో పెద్ద విజయాలు సాధించిన సినిమాలన్నీ రీమేక్లే. అందుకే ఈసారి మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్’ని తీసుకుని ‘శేఖర్’ తెరకెక్కించాం.
ముందస్తు విడుదల వేడుకలో మీ మాటల్లో ఒత్తిడి కనిపించింది?
ఈ సినిమా విజయవంతమైతేనే అప్పుల నుంచి బయటపడతాం. ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఓ విభిన్నమైన సినిమాని ఇవ్వాలనే ఈ కథని ఎంపిక చేసుకున్నా. వాళ్లని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పరచను. నాకు మంచి చేయాలని ప్రేక్షకులు అనుకుంటే ‘సినిమా బాగుంది’ అన్న మాట వినిపించిన వెంటనే థియేటర్కి వెళ్లమని చెబుతున్నా. ఎప్పుడూ లేనంత ఒత్తిడితోనే నా సినిమాని బతికించండి అనే మాటని చెప్పా.
కొవిడ్ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మళ్లీ సెట్లోకి అడుగుపెట్టడం ఎలా అనిపించింది?
ఆ సమయంలో డెత్ బెడ్పైకి వెళ్లి మళ్లీ వచ్చాను. 75 కేజీల బరువుండే నేను 62కి తగ్గాను. కూర్చున్నా ఆయాసం వచ్చేది. నాకు బోర్ కొట్టకుండా చికిత్స జరిగేటప్పుడు ఐసీయూలో టీవీ పెట్టారు. అందులో హీరోల డ్యాన్సులు, ఫైట్లు చూసి ‘నేను ఇలా ఉండేవాణ్ని కదా, జీవితం ఇలా అయిపోయిందేమిట’ని బాధపడ్డా. ఇంక నేను సినిమాలు చేయడానికి పనికి రాననుకున్నా. జీవితతో ‘జోసెఫ్’ రీమేక్ హక్కుల్ని ఎవరైనా అడిగితే ఇచ్చేయ్ అని చెప్పా. తను ‘లేదండీ, మీరు కోలుకుంటార’ని చెప్పేది. సినిమాపై కసితో మళ్లీ సెట్లోకి అడుగుపెట్టి ‘శేఖర్’ని పూర్తి చేశా. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణంలో ‘శేఖర్’ ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
‘శేఖర్’లో కొత్తగా కనిపిస్తున్నారు. నటుడిగా ఇది ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
నటుడిగా చాలా సంతృప్తినిచ్చింది. పాత్ర, అందులో ఉన్న భావోద్వేగాలు అలాంటివి. 55, 60 ఏళ్ల మధ్య వయస్కుడిగా కనిపిస్తా. సెన్సార్ సభ్యుల నుంచి వచ్చిన స్పందన మొదలుకొని, సాయికుమార్ చెప్పిన మాటల వరకు కచ్చితంగా హిట్ కొడుతున్నామనే నమ్మకాన్ని పెంచాయి. అనూప్ రూబెన్స్ సంగీతం చాలా బాగా కుదిరింది. కొన్ని సన్నివేశాల్లో సంభాషణలు ఉండవు. సంగీతమే వాటిని నడిపిస్తుంటుంది.
‘దొరసాని’ దర్శకుడు మహేంద్ర మా నలుగురి కోసం ఓ కథ చెప్పారు. కొన్ని మార్పుల్ని సూచించాం. ప్రవీణ్ సత్తారు ‘గరుడవేగ2’లో మీతోపాటు, ఇద్దరు కూతుళ్లు కనిపించేలా ఓ ఆలోచన ఉందని చెప్పారు. భవిష్యత్తులో తప్పకుండా చేస్తాం. తదుపరి నేను చేయనున్న సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో ఓ స్క్రిప్ట్ సిద్ధమైంది. త్వరలోనే ఆ వివరాల్ని చెబుతా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్