Samantha: త్వరలోనే బాలీవుడ్ చిత్రం!
సమంత... హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్.. ఇలా అన్ని పరిశ్రమల్లో అవకాశాలు అందిపుచ్చుకొంటోంది. ఇప్పటికే ‘ఫ్యామిలీ మెన్ 2’తో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సామ్.. ఓ హాలీవుడ్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. తొలిసారి ఆమె ఏ బాలీవుడ్ చిత్రంలో మెరవనుంది? అని ఆమె అభిమానుల్లో ఆసక్తి ఉంది.
సమంత (Samantha)... హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్.. ఇలా అన్ని పరిశ్రమల్లో అవకాశాలు అందిపుచ్చుకొంటోంది. ఇప్పటికే ‘ఫ్యామిలీ మెన్ 2’తో(The Family Man2) హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సామ్.. ఓ హాలీవుడ్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. తొలిసారి ఆమె ఏ బాలీవుడ్ చిత్రంలో మెరవనుంది? అని ఆమె అభిమానుల్లో ఆసక్తి ఉంది. త్వరలోనే దానికి సమాధానం రానుంది. వరుస హిట్లతో బాలీవుడ్లో తనకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆయుష్మాన్ ఖురానాతో(Ayushmann Khurrana) కలసి ఆమె తెర పంచుకోనుందని తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ (Bollywood) ఎంట్రీ కోసం ఆమె అనేక కథలు విన్నారు. వాటిల్లో ఇంకా దేన్ని ఓకే చేయలేదు. ప్రస్తుతం ఓ స్క్రిప్ట్ ఆమెకు నచ్చిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అందులోని హ్యూమర్, కామెడీ, సస్పెన్స్ అంశాలు సామ్ను మెప్పించాయట. అందుకే ఈ ప్రాజెక్టు ఓకే చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడని తెలుస్తోంది. దినేష్ విజన్ అనే నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి. సమంత వరుణ్ ధావన్తో కలసి చేస్తున్న హిందీ వెబ్సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగులో ఆమె ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాల్లో నటిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్