Tollywood: ‘జిలేబి’ మొదలు
సీనియర్ దర్శకుడు కె.విజయభాస్కర్ కొంత విరామం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ‘జిలేబి’. శ్రీకమల్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.
సీనియర్ దర్శకుడు కె.విజయభాస్కర్ (Vijay Bhaskar) కొంత విరామం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ‘జిలేబి’ (Jilebi). శ్రీకమల్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. శివాని రాజశేఖర్ కథానాయిక. గుంటూరు రామకృష్ణ, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతలు. విజయ దశమి సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్నిచ్చారు. కథానాయకుడు రాజశేఖర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత స్రవంతి రవికిశోర్ చిత్రబృందానికి స్క్రిప్ట్ అందజేశారు. ‘‘నేను చాలా ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. సినిమా రంగంలో అనుభవం ఉన్న నిర్మాతలతో కలిసి ప్రయాణం చేస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు కె.విజయభాస్కర్. రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, గెటప్ శ్రీను, మిర్చికిరణ్, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల, కళ: సంపత్రావు, కూర్పు: ఎం.ఆర్.వర్మ
బాబా జీవిత కథతో...
పుట్టపర్తి శ్రీసత్యసాయి బాబా జీవితం ఆధారంగా ‘శ్రీసత్యసాయి అవతారం’ (SrisatyaSai Avataram) తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రానికి సాయిప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకి ఇది వందో చిత్రం కావడం విశేషం. సాయివేదిక్ ఫిలింస్ పతాకంపై డా.దామోదర్ నిర్మిస్తున్నారు. విజయదశమి రోజున ప్రారంభమైన ఈ సినిమాకి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి క్లాప్నివ్వగా, నిర్మాతలు కె.అచ్చిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఎస్.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయికుమార్, సుమన్, బాబు మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘బాబా వారికి 180 దేశాల్లో భక్తులు ఉన్నారు. ఆయనతో సన్నిహితంగా గడిపే అదృష్టం నాకు దక్కింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించడం కూడా ఆయన దయే అనేది నా అభిప్రాయం. అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండని చెప్పేవారు బాబా. అందులో మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప విషయం ఇమిడి ఉంది. ఇందులో 400 మంది నటిస్తారు. నవంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు అర్చన, కోట శంకర్రావు, అశోక్కుమార్, పృథ్వీ, శివపార్వతి, సహ నిర్మాత గోపీనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్