Tollywood: అతిథి కాదు.. అంతకు మించి
నేడు కథలు చెప్పే విధానం పూర్తిగా మారిపోయింది. ఏ తరహా కథ ఎంచుకున్నా.. దాన్ని ఓ భాషా పరిశ్రమకే పరిమితం చేయడం లేదు. ప్రాంతీయ, భాషా హద్దులు చెరిపేస్తూ అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
నేడు కథలు చెప్పే విధానం పూర్తిగా మారిపోయింది. ఏ తరహా కథ ఎంచుకున్నా.. దాన్ని ఓ భాషా పరిశ్రమకే పరిమితం చేయడం లేదు. ప్రాంతీయ, భాషా హద్దులు చెరిపేస్తూ అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నటుడిగా ఉండటాన్ని ఒక వరంలా భావిస్తోంది నాయకా లోకం. ఎందుకంటే స్టార్ హీరోగా ఓ ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కొని ఒక భాషకే పరిమితమయ్యే కన్నా.. వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ.. నటుడిగా అందరికీ దగ్గరవడమే మేలని నమ్ముతున్నారు కథానాయకులు. ఫలితంగా తమ మార్కెట్ పరిధి విస్తృతమవ్వడమే కాక.. తమ ప్రతిభను అన్ని చిత్రసీమలకు పరిచయం చేసే అవకాశం దొరుకుతుంది. అందుకే ఇప్పుడీ పంథాని ఇటు అగ్ర హీరోలు.. అటు యువ హీరోలు బాగా అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు తెలుగులో హీరోగా మెప్పిస్తూనే.. పరభాషా చిత్రాల్లో నటుడిగా మెరిసేందుకు సిద్ధపడుతున్నారు. ఫలితంగా సినీప్రియులకు తెరపై అరుదైన కలయికలు చూసే అవకాశం దొరుకుతోంది.
తెలుగు హీరోలు పరభాషా చిత్రాల్లో నటుడిగా మెరిసింది చాలా తక్కువే. ఇక్కడ స్టార్ హీరోగా పేరు తెచ్చుకుని మరో భాషలో సహ నటుడిగా చేస్తే ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందోన్న భయాలు వెంటాడేవి. అందుకే తెలుగు హీరోల నుంచి ఈ తరహా ప్రయత్నాలు అరుదుగా కనిపించేవి. అయితే పాన్ ఇండియా సంస్కృతి ఈ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. వైవిధ్యభరితమైన పాత్రలు ఎదురైతే చాలు.. ఇమేజ్ను పక్కకు పెట్టి మరీ మరో హీరోతో కలిసి తెర పంచుకునేందుకు రంగంలోకి దిగిపోతున్నారు. ఇటీవల అగ్ర హీరో నాగార్జున ‘బ్రహ్మాస్త్ర’ కోసం ఈతరహా ప్రయత్నమే చేశారు. ఇక ఆయన తనయుడు నాగచైతన్య ‘లాల్ సింగ్ ఛడ్డా’లో కీలక పాత్ర పోషించి, మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అగ్ర హీరో వెంకటేష్ చేతిలో కనిపిస్తున్న రెండు సినిమాలూ ఈ తరహా ప్రయత్నాలే. అందులో ఒకటి సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. ఇందులో వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో కథానాయకుడు రామ్చరణ్ ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరవనుండటం మరో విశేషం. ఇక వెంకీ అతిథి పాత్రలో సందడి చేసిన మరో చిత్రం ‘ఓరి దేవుడా’. విష్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రమిది.
యువ కథానాయకుల సందడి
యువ కథానాయకుడు సందీప్ కిషన్ ‘కెప్టెన్ మిల్లర్’లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ధనుష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. అత్యంత భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమా.. ఇటీవలే పట్టాలెక్కింది. మరో యువ హీరో సత్యదేవ్ ఇటీవల చిరంజీవి ‘గాడ్ఫాదర్’ కోసం ప్రతినాయకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన హిందీలో అక్షయ్ కుమార్తో కలిసి ‘రామ్సేతు’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో అక్షయ్కు సహాయ పడే ఓ కీలక పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. కథానాయకుడు విష్వక్ సేన్ ఓ చిన్న సినిమాలో కీలక పాత్ర పోషించారు. అదే ‘ముఖచిత్రం’. ఈ చిత్రంలో.. విశ్వామిత్ర అనే న్యాయవాది పాత్రలో సందడి చేశారు విష్వక్ సేన్. ఓవైపు హీరోగా మెప్పిస్తూనే.. మంచి పాత్రలు దొరికినప్పుడల్లా సహాయ నటుడిగానూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు సుశాంత్. అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలో రాజ్ మనోహర్గా కీలక పాత్రలో సందడి చేసిన ఆయన.. ఇప్పుడు ‘రావణాసుర’లో రామ్గా పలకరించేందుకు సిద్ధమయ్యారు. రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రమిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింపజేస్తాం
‘బాహుబలి’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేటెడ్ సిరీస్ ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’. దీనికి జీవన్ జె.కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. -
ఊరిస్తున్న ఎన్టీఆర్
‘దేవర’ ప్రచార చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించారు ఎన్టీఆర్. ‘వార్ 2’ కోసం హిందీలోకి అడుగుపెట్టి.... ఆ కొత్త ప్రయాణం గురించీ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేశారు. ఆయన పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో మరోసారి ‘దేవర’ ప్రచార చిత్రాలు కానీ, పాటతో కానీ హంగామా చేయొచ్చని పరిశ్రమ, అభిమాన వర్గాల అంచనా. -
తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ మలుపు... ఆర్య
‘‘తెలుగు సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించేలా అప్పట్లో ‘ఆర్య’ తీశారు సుకుమార్. ఎంతో మంది దర్శకులు... ఎన్నో మంచి చిత్రాలు ఈ సినిమా నుంచే వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు’’ అన్నారు అల్లు అర్జున్. -
మెరుపుల తార.. తళుకుల చీర
అందం, నటనతో అలరిస్తున్న బాలీవుడ్ అగ్రనాయిక అలియా భట్ ఈసారి ఆకట్టుకునే వస్త్రధారణతో అంతర్జాతీయ యవనికపై అలరించింది. ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక ‘మెట్ గలా’లో ఆమె చీరలో మెరిసింది. -
రోడ్లన్నీ గతుకులపాలే.. ఊరంతా చీకటిపాలే
ఓట్లు కొనేసి ఆ తర్వాత ప్రజల బాగుని మరిచే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని... గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిస్తూ ‘కమిటీ కుర్రోళ్ళు’ పాటందుకున్నారు. మరి వారి ఆట పాట జనాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘డియర్ స్టూడెంట్స్’ సందడి మొదలు
ఇటీవలే ‘డియర్ స్టూడెంట్స్’ అగ్రతార నయనతారకు స్వాగతం పలికారు. ఈమె, నివిన్ పౌలీ జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రమిది. సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్రాయ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. -
జులై 20న... కౌలాలంపూర్లో
తెలుగు సినిమా వైభవాన్ని... వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుకని నిర్వహిస్తామని చెప్పారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. జులై 20న కౌలాలంపూర్, బుకిట్ జలీల్లోని ప్రతిష్ఠాత్మక నేషనల్ స్టేడియంలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
తెరపై యుద్ధం.. ఖర్చు రూ.8కోట్లు
‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఇప్పుడు ‘స్వయంభూ’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తామని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్