K Viswanath: సునిశిత హాస్య స్రష్ట
కళా తపస్వి కె.విశ్వనాథ్ (K Viswanath) చిత్రాలంటే వీనుల విందైన శాస్త్రీయ సంగీతం, నృత్యాలు.. వీటికి దీటుగా సాహితీ సౌరభాలు సహజసిద్ధంగా ఉంటాయి. అంతే కాదు.. సమపాళ్లలో దట్టించి పప్పులో ఉప్పులా కలిసిపోయిన సునిశిత హాస్యమూ ఉంటుంది.
కళా తపస్వి కె.విశ్వనాథ్ (K Viswanath) చిత్రాలంటే వీనుల విందైన శాస్త్రీయ సంగీతం, నృత్యాలు.. వీటికి దీటుగా సాహితీ సౌరభాలు సహజసిద్ధంగా ఉంటాయి. అంతే కాదు.. సమపాళ్లలో దట్టించి పప్పులో ఉప్పులా కలిసిపోయిన సునిశిత హాస్యమూ ఉంటుంది. ఈ హాస్యం కథలో భాగంగా ఉంటుందే కానీ, కథకు సంబంధం లేకుండా నేల విడిచి సాము చేయదు.
* విశ్వనాథ్కు దేశ, విదేశాల్లో ఖ్యాతిని ఆర్జించిపెట్టిన ‘శంకరాభరణం’ లాంటి సీరియస్ చిత్రంలోనూ అల్లు పాత్ర ద్వారా నవ్వులు పూయించారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే తన స్నేహితుడైన సంగీత సమ్రాట్టు శంకరశాస్త్రికి సన్మానం చేస్తామని కన్నడ సంఘం సెక్రటరీ వచ్చినపుడు అల్లు చేసే సిఫార్సు, శంకరశాస్త్రి ఉరిమి చూసినపుడల్లా తన భార్య కిలో మూడు రూపాయలతో మార్కెట్ నుంచి తెచ్చిన పుచ్చు వంకాయల ప్రస్తావన తీసుకురావడం ప్రేక్షకుణ్ని గిలిగింతలు పెట్టిస్తుంది. న్యాయవాది అయిన అల్లు వద్దకు ఓ క్లయింటు (నటుడు థమ్) కుటుంబ వివాదంతో రాగా, మాటల మధ్యలో భార్య లోపలి నుంచి పిలవడం అలా మాటిమాటికీ లోనికి వెళ్లి వస్తూ.. ‘ఆ చెప్పు నాయనా! మీ నాన్నకు ఇద్దరు పెళ్లాలా!’ అంటూ ఓమారు, ‘మీ అమ్మకు ఇద్దరు మొగుళ్లా!’ అంటూ మరోమారు.. ‘నీకు ఇద్దరు పెళ్లాలా!’ అంటూ మూడోమారు అల్లు కన్ఫ్యూజనుగా చెప్పేసరికి ఆయనకు ఓ దండం పెట్టి థమ్ విసురుగా వెళ్లిపోతాడు.
* మరో సీరియస్ చిత్రం ‘సప్తపది’లోనూ అల్లు పాత్ర ద్వారానే హాయిగా నవ్వులు పండించారు. గ్రామపెద్ద రాజు గారి పాత్ర పోషించిన అల్లు ఇంటికి ఆరో కుమార్తె పురుడు కోసం వస్తుంది. ఆ సమయంలో అల్లు భార్య సైతం నిండుగర్భంతో ఉంటుంది. తల్లీకూతుళ్లు ఎదురుపడి సిగ్గుపడిపోతూ ‘‘ఎన్నో నెల?’’ అని పరస్పరం కుశల ప్రశ్నలు అడుక్కోవడం, జాగ్రత్తలు చెప్పుకోవడం చూసి నవ్వకుండా ఉండగలమా! ఈ మాట తెలియకుండా వరండాలో కూర్చొన్న అల్లుడితో అసలు విషయం చెప్పలేక అల్లు సతమతం అవుతుంటాడు. ‘మీ అత్తగారిని అమ్మాయితో పురుడుకు పంపడం కుదరదయ్యా! ఎందుకంటే.. అందుకే మరి’ అంటూ అటు తిరుక్కొని ఇటి దూలానికి తాళం వేస్తూ అల్లు చెప్పిన తీరు చక్కిలిగింతలు పెట్టి నవ్విస్తుంది.
* విశ్వనాథ్ తీసిన మరో శిఖర సమాన చిత్రం ‘సాగర సంగమం’లోనూ హాస్యం సమాంతరంగా సాగుతుంది. ‘ఇంటద్దె అడిగితే ఆత్మహత్య చేసుకుంటాం’ అంటూ ఇంటికి నోటీసు అంటించిన సుందోపసుందులు (కమల్హాసన్, శరత్బాబు) ఆ ఇంటి యజమాని థమ్తో బంతాట ఆడుకోవడం భలే సరదాగా ఉంటుంది. పనివాడు శివయ్య పాత్ర పోషించిన పొట్టి ప్రసాద్ను కమల్హాసన్ ‘తీర్థం’ (మద్యం) ఎక్కడ దొరుకుతుందో తెలుసా?’ అని అడిగినపుడు.. ‘‘తెలుసయ్యా! ఒక్క తీర్థం మాత్రమే కాదయ్యా! తీర్థం, పెసరపప్పు ఉదయం శివాలయంలోనయ్యా! తీర్థం, చక్కెర పొంగళి సాయంత్రం వైష్ణవాలయంలోనయ్యా!’ అని చెప్పిన సమాధానం ఫక్కున నవ్విస్తుంది.
జి.ఎస్.జమీర్ హుసేన్
* ఆస్కార్ నామినేషనుకు వెళ్లిన విశ్వనాథ్ చిత్రం ‘స్వాతిముత్యం’లో పిసినారి సుత్తి వీరభద్రరావును ఎంత తిట్టుకుంటామో, అంత నవ్వుకుంటాం. ఇంటికి వచ్చిన తండ్రి (మల్లికార్జునరావు)కి కుమార్తె (అనిత) ఫలహారం పెడుతుంది. ఇది చూసిన సుత్తి వీరభద్రరావు తన ఇంటి మీద పడి తింటున్నాడని మామను తిట్టిపోస్తాడు. అవమానంతో గోదాట్లో దూకి చనిపోతానని తండ్రి బయలుదేరగా.. ‘‘ఉండు నాన్నా! నీతోపాటు నేనూ చచ్చిపోతా’’ అని అనిత బయలుదేరబోతుంది. ఇదంతా చూస్తున్న అల్లుడు ‘‘ఆగు.. ఇదేం ఈతల పోటీ అనుకున్నారటే! ఒకళ్ల వెనకాల మరొకళ్లు దూకి చనిపోవటానికి? మీరెవరూ దూకి చావనక్కర్లేదు. ఇక్కడే బతికి చావండి.. నన్ను చంపండి’’ అంటూ మరోమారు తిట్టిపోస్తాడు.
‘‘చూడు నాయనా! ఇళ్లు కాలిపోయినవాళ్లను నువ్వు చూసి ఉంటావు. ఒళ్లు కాలిపోయినవాళ్లను చూసి ఉంటావు. పతిభక్తితో కాలిపోతున్నవాణ్ని చూశావా.. అది నేనే’’ అంటూ ‘స్వర్ణకమలం’లో సాక్షి రంగారావు పలికే సంభాషణలకు పడి పడి నవ్వుకుంటాం. ఈయన భార్య పాత్ర పోషించిన శ్రీలక్ష్మి సంతానభాగ్యం కోసం 24 గంటలూ అందరు దేవుళ్లను పూజిస్తూ ఆ హారతులు తీసుకువచ్చి భర్త ముఖాన్ని కుంపట్లో కాలిన కుమ్మొంకాయలా చేస్తూ ఉంటుంది. ఇంటి నిండా దేవుళ్ల పటాలే. అన్నీ నిత్య హారతులతో మసిబారి ఉంటాయి.
తకిట తధిమి తకిట తధిమి తందాన..
ఇది హాస్య సన్నివేశం కాదు. సున్నిత భావాలను కళాత్మకంగా చూపే విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభకు మచ్చుతునక. ‘సాగరసంగమం’లో తప్ప తాగి పెరటి బావిపై బాలు (కమల్హాసన్) నృత్యం చేస్తుంటాడు. అతణ్ని కాపాడేందుకు తప్పనిసరై నుదుట బొట్టు పెట్టుకొని (భర్త చనిపోయి ఉంటాడు) వెళ్లి చేయి పట్టుకొంటుంది మాధవి (జయప్రద). చాన్నాళ్ల తర్వాత ఆమెను అక్కడ చూసిన బాలు నిర్ఘాంతపోతాడు. మాధవిని ఎప్పుడూ సుమంగళిగానే చూడాలని అనుకునే అతడు వర్షానికి కరిగిపోతున్న ఆమె బొట్టుకు తన అరచేయిని అడ్డుపెట్టి లోనికి తీసుకువెళతాడు. ఈ దృశ్యం ఆ చిత్రానికి ఆయువుపట్టు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?