అప్పుడూ ఇప్పుడూ కథ నచ్చే చేశా!
‘‘తొలి సినిమా ‘నాంది’ డబ్బు కంటే కూడా వెలకట్టలేని పేరు తీసుకొచ్చింది. నిర్మాతగా ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
‘‘తొలి సినిమా ‘నాంది’ డబ్బు కంటే కూడా వెలకట్టలేని పేరు తీసుకొచ్చింది. నిర్మాతగా ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఆ గుర్తింపుకి దీటుగానే ‘నేను స్టూడెంట్ సర్’ ఉంటుంద’’న్నారు సతీశ్ వర్మ. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ పతాకంపై సినిమాల్ని రూపొందిస్తున్న నిర్మాత ఆయన. తొలి ప్రయత్నంగా ‘నాంది’ చిత్రాన్ని నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఆయన రెండో ప్రయత్నమే ‘నేను స్టూడెంట్ సర్’. బెల్లంకొండ గణేశ్ కథానాయకుడిగా నటించగా, రాకేశ్ ఉప్పలపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సతీశ్ వర్మ సోమవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
* ‘‘మార్కెట్... వసూళ్ల లెక్కల్ని చూసుకుని సినిమాలు చేయను. ‘నాంది’ కూడా అప్పట్లో కథ నచ్చి, మిగతావేవీ పట్టించుకోకుండా ధైర్యంగా చేసిన సినిమానే. ‘నేను స్టూడెంట్ సర్’ చేయడానికి కారణం కూడా కథలోని కొత్తదనమే. ఒక మంచి థ్రిల్లర్గా అన్ని వయసులవారికీ నచ్చేలా ఉంటుంది. కథలోని మూడు ప్రధానమైన మలుపులు, పతాక సన్నివేశాలు సినిమాకి కీలకం. ఓ విద్యార్థి జీవితం తెరపై కనిపిస్తుంది. అది అందరికీ కనెక్ట్ అవుతుంది. ఓ విద్యార్థి ఐ ఫోన్తో ముడిపడిన కథ ఇది. మనం తరచూ పత్రికల్లోనూ ఇలాంటి సంఘటనల గురించి చదువుతుంటాం. కానీ పట్టించుకోం. ఆ సంఘటన ఏమిటి? ఆ విషయాన్ని ఎంత థ్రిల్లింగ్గా చెప్పామనేది తెరపైనే చూడాలి’’.
* ‘‘పేరున్న దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవంతో రాకేశ్ చాలా బాగా తీశాడు. భాగ్యశ్రీ తన కూతురు అవంతికని కథానాయికగా పరిచయం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. అప్పుడే మేం సంప్రదించాం. అలా తను ఇందులో కథానాయిగా నటించింది. మహతి స్వరసాగర్ మంచి సంగీతం ఇచ్చారు’’.
* ‘‘తదుపరి మా సంస్థలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్తో ఓ కల్పిత బయోపిక్ సినిమాని చేస్తున్నాం. ఒలింపిక్స్ నేపథ్యంలో సాగే కథ అది. రాకేశ్ ఉప్పలపాటి దర్శకత్వంలోనే ఆ సినిమా ఉంటుంది. ‘నాంది’కి కొనసాగింపు ఆలోచన కూడా ఉంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాక్సాఫీస్ బరిలో అదిరే ఆట వసూళ్ల వేట
క్రీడా నేపథ్య కథలపై ప్రేక్షకులతో పాటు సినీతారలు మక్కువ కనబరుస్తుంటారు. ఆట.. అందులోని సవాళ్లు.. గెలుపు కోసం చేసే సాహసోపేతమైన ప్రయాణం.. -
గోవాకు దేవర
‘దేవర’ను పూర్తి చేయడమే లక్ష్యంగా వడివడిగా అడుగులేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
నిద్ర కోసం ఆరాటపడిన రోజులున్నాయి
‘సరదాగా తీసుకునే చిన్న చిన్న విరామాలు నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి, చిత్రాల ఎంపిక విషయంలో ఎంతో దోహదపడతాయని నా అభిప్రాయం’ అంటోంది మృణాల్ ఠాకూర్. చేతి నిండా సినిమాలు... -
ప్రేక్షకుల్లో గమనించిన మార్పు అదే!
‘‘కొత్త కథలతో సినిమాలు చేయాలన్నదే నా ప్రయత్నం. పంపిణీదారుడిగా ఉన్నప్పుడు నా అభిరుచుల్ని కథానాయకులు నమ్మారు. వాళ్ల ప్రోత్సాహంతోనే నిర్మాతగా ప్రయాణం చేస్తున్నా’’ అన్నారు రాజేశ్ దండా. -
చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా
చిత్రసీమలో ఉత్తేజాన్ని, సినీ ఔత్సాహికుల్లో స్ఫూర్తిని నింపేలా సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ని నిర్వహిస్తున్నట్టు ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ప్రకటించాయి. -
‘మగధీర’, ‘ప్రేమికుడు’ మళ్లీ..
రామ్చరణ్ కథానాయకుడిగా అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’తోపాటు, ప్రభుదేవా కథానాయకుడిగా మరో అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘ప్రేమికుడు’ రీరిలీజ్గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. -
ప్రతినాయకుడిగా శివాజీ
‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు కొండా విజయ్ కుమార్. ఇప్పుడాయన ‘అహం’ పేరుతో ఓ చిత్రం చేస్తున్నారు. -
మోహన్లాల్ @ 360
‘మలైకోటై వాలిబన్’ చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్నారు మలయాళ అగ్రకథానాయకుడు మోహన్లాల్. ప్రస్తుతం ఆయన.. మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. -
యమధీర రాజకీయం
కన్నడ తార కోమల్ కుమార్ కథానాయకుడిగా... శంకర్.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన అనువాద చిత్రం ‘యమధీర’. రిషిక శర్మ కథానాయిక. క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యభూమిక పోషించారు. -
రాజమండ్రిలో భీమునిపట్నం
కంచర్ల ఉపేంద్ర, అపర్ణాదేవి జంటగా నటిస్తున్న చిత్రం ‘1920 భీమునిపట్నం’. నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్నారు. -
Social Look: ‘ఫ్రెష్’ ఫీలింగ్తో ప్రగ్యా.. బ్రదర్కి అనుపమ విషెస్.. చీరలో అదితి, ఐశ్వర్య హొయలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Kantara: ‘కాంతార 2’.. హీరోయిన్గా ఆమెను ఎంపిక చేస్తున్నారా?
‘కాంతార 2’ హీరోయిన్పై చిత్ర పరిశ్రమలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే?
తాజా వార్తలు (Latest News)
-
కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ?
-
దాతలూ స్పందించండి.. ఈ చిన్నారిని ఆదుకోండి
-
రూ.లక్షలు పెట్టు.. ఫ్యాన్సీ నంబరు పట్టు!
-
Indian Navy: కొచ్చిలో కుప్పకూలిన నిఘా ఎయిర్క్రాఫ్ట్
-
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
-
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం