అప్పుడూ ఇప్పుడూ కథ నచ్చే చేశా!
‘‘తొలి సినిమా ‘నాంది’ డబ్బు కంటే కూడా వెలకట్టలేని పేరు తీసుకొచ్చింది. నిర్మాతగా ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
‘‘తొలి సినిమా ‘నాంది’ డబ్బు కంటే కూడా వెలకట్టలేని పేరు తీసుకొచ్చింది. నిర్మాతగా ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఆ గుర్తింపుకి దీటుగానే ‘నేను స్టూడెంట్ సర్’ ఉంటుంద’’న్నారు సతీశ్ వర్మ. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ పతాకంపై సినిమాల్ని రూపొందిస్తున్న నిర్మాత ఆయన. తొలి ప్రయత్నంగా ‘నాంది’ చిత్రాన్ని నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఆయన రెండో ప్రయత్నమే ‘నేను స్టూడెంట్ సర్’. బెల్లంకొండ గణేశ్ కథానాయకుడిగా నటించగా, రాకేశ్ ఉప్పలపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సతీశ్ వర్మ సోమవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
* ‘‘మార్కెట్... వసూళ్ల లెక్కల్ని చూసుకుని సినిమాలు చేయను. ‘నాంది’ కూడా అప్పట్లో కథ నచ్చి, మిగతావేవీ పట్టించుకోకుండా ధైర్యంగా చేసిన సినిమానే. ‘నేను స్టూడెంట్ సర్’ చేయడానికి కారణం కూడా కథలోని కొత్తదనమే. ఒక మంచి థ్రిల్లర్గా అన్ని వయసులవారికీ నచ్చేలా ఉంటుంది. కథలోని మూడు ప్రధానమైన మలుపులు, పతాక సన్నివేశాలు సినిమాకి కీలకం. ఓ విద్యార్థి జీవితం తెరపై కనిపిస్తుంది. అది అందరికీ కనెక్ట్ అవుతుంది. ఓ విద్యార్థి ఐ ఫోన్తో ముడిపడిన కథ ఇది. మనం తరచూ పత్రికల్లోనూ ఇలాంటి సంఘటనల గురించి చదువుతుంటాం. కానీ పట్టించుకోం. ఆ సంఘటన ఏమిటి? ఆ విషయాన్ని ఎంత థ్రిల్లింగ్గా చెప్పామనేది తెరపైనే చూడాలి’’.
* ‘‘పేరున్న దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవంతో రాకేశ్ చాలా బాగా తీశాడు. భాగ్యశ్రీ తన కూతురు అవంతికని కథానాయికగా పరిచయం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. అప్పుడే మేం సంప్రదించాం. అలా తను ఇందులో కథానాయిగా నటించింది. మహతి స్వరసాగర్ మంచి సంగీతం ఇచ్చారు’’.
* ‘‘తదుపరి మా సంస్థలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్తో ఓ కల్పిత బయోపిక్ సినిమాని చేస్తున్నాం. ఒలింపిక్స్ నేపథ్యంలో సాగే కథ అది. రాకేశ్ ఉప్పలపాటి దర్శకత్వంలోనే ఆ సినిమా ఉంటుంది. ‘నాంది’కి కొనసాగింపు ఆలోచన కూడా ఉంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?