Kaliyugam Pattanamlo: ‘కలియుగం కలుషితం’ అనుకున్నాము

విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్‌ జంటగా రమాకాంత్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్‌ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది.

Updated : 28 Mar 2024 12:31 IST

విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్‌ జంటగా రమాకాంత్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్‌ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల ముందస్తు వేడుకని నిర్వహించారు. ఈ వేడుకకు హీరో సుమన్‌, నిర్మాత ఎ.ఎం.రత్నం, గీత రచయిత చంద్రబోస్‌ తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ‘చంద్రబోస్‌ రాసిన ‘కలియుగం కలుషితం’ అనే పాట బాగుంది. ఆ పాటనే టైటిల్‌గా పెడితే బాగుండేదని అనుకున్నా’ అన్నారు ఎ.ఎం రత్నం. ‘విశ్వ అద్భుతంగా నటించాడు. ఆయూషికి ఇదే తొలి చిత్రం. చూడగానే ఈ పాత్రకు సెట్‌ అవుతుందని అనుకున్నాము. కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు తప్పక సినిమాని చూస్తారు. అలాంటి సినిమానే ఇద’ని అన్నారు దర్శకనిర్మాతలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని