Keerthy Suresh: ఆ సినిమా కోసం భారీ పారితోషికం?

తెలుగు/తమిళ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటి కీర్తి సురేశ్‌. ‘మహానటి’ తర్వాత ఆమె గ్రాఫ్

Published : 22 Oct 2021 11:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు/తమిళ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటి కీర్తి సురేశ్‌. ‘మహానటి’ తర్వాత ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగింది. తెలుగులో ప్రస్తుతం ‘భోళా శంకర్’, ‘సర్కారు వారి పాట’, ‘దసరా’చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల పండగను పురస్కరించుకుని నాని కొత్త చిత్రం ‘దసరా’ను ప్రకటించారు. టైటిల్‌ టీజర్‌తోనే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నాని లుక్ కాస్త డిఫరెంట్‌గా ఉండటం, తెలంగాణ యాస మాట్లాడటం ఆసక్తిగా అనిపించింది.

ఇక ఈ సినిమా కోసం కీర్తి సురేశ్‌ భారీ పారితోషికం తీసుకుంటోందట. ‘దసరా’ కోసం ఆమె రూ.3కోట్లు తీసుకొంటున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. భారీ బడ్జెట్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకూడదని చిత్ర బృందం భావిస్తోందట. అందులో భాగంగానే ఆమె అడిగిన పారితోషికాన్ని ఇస్తునట్లు తెలుస్తోంది. గతంలో నానితో కలిసి కీర్తి సురేశ్‌ ‘నేను లోకల్‌’ చేశారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని