janhvi kapoor: అమ్మ చేత్తో నాకోసం రాసిందే... నాచేతిపై టాటూ
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన తల్లి, ప్రముఖ హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ ఓ భావోద్వేగ పోస్టు చేశారు. 2018లో శ్రీదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. తల్లిని ఎంతో ప్రేమించే జాన్వీ ఆమె జ్ఞాపకార్థం... అమ్మ చేత్తో తన కోసం రాసిన మాటల్నే.. చేతిపై టాటూగా వేయించుకున్నారు.
తల్లి శ్రీదేవిని గుర్తుచేసుకున్న జాన్వీకపూర్
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన తల్లి, ప్రముఖ హీరోయిన్, శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ ఓ భావోద్వేగ పోస్టు చేశారు. 2018లో శ్రీదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. తల్లిని ఎంతో ప్రేమించే జాన్వీ ఆమె జ్ఞాపకార్థం... అమ్మ చేత్తో తన కోసం రాసిన మాటల్నే.. చేతిపై టాటూగా వేయించుకున్నారు. శ్రీదేవి జాన్వీని ముద్దుగా లబ్బూ అని పిలుస్తారట. ‘‘ ఐ లవ్ యూ మై లబ్బూ,. యూ ఆర్ ది బెస్ట్ బేబీ ఇన్ ది వరల్డ్’’ అని శ్రీదేవి ఓ పేపర్ మీద రాసిచ్చిన వ్యాక్యాల్లో ‘‘ ఐ లవ్ యూ లబ్బూ’’ పదాలను చేతిపై ఎప్పటికీ చెదరకుండా ఉండేలా పర్మనెంట్ టాటూ వేయించారు. ఈ సందర్భంగా ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. వాటితో పాటు ఇటీవలే ఆమె సందర్శించిన దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల ఫొటోలను జతచేశారు.
అందుకే ఆ చీర అంటే స్పెషల్..
చిన్నప్పుడు శ్రీదేవి ధరించిన చీర అంటే జాన్వీకి ఎంతో ఇష్టమట. ‘మామ్’లో శ్రీదేవి నటనకు గానూ జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. అప్పటికే ఆమె కన్నుమూయడంతో తన తల్లి తరఫున జాన్వీ కపూర్ ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమానికి శ్రీదేవి చీరను ధరించి అవార్డు అందుకోవడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?