Kiara Advani: వాటి గురించే ఆలోచిస్తూ ఏడ్వొద్దని సిద్ధార్థ్‌ అన్నాడు: కియారా

హీరోయిన్ కియారా అడ్వాణీ (Kiara Advani) తనపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడింది. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధార్థ్‌ మల్హోత్ర ఎంతో ధైర్యాన్నిచ్చినట్లు తెలిపింది.

Updated : 19 Jul 2023 13:18 IST

ముంబయి: ఇటీవలే ‘సత్యప్రేమ్‌ కీ కథ’ (Satyaprem Ki Katha) సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకుంది నటి కియారా అడ్వాణీ (Kiara Advani). అయితే.. పెళ్లి తర్వాత ఈ చిత్రంలో నటించడంపై కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా వాటిపై స్పందించింది.

‘‘పెళ్లైన తర్వాత సినిమాలు చేయడం ఎందుకు? అంటూ కొందరు నాపై విమర్శలు కురిపించారు. అవి నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. కానీ, నా పాత్రను చాలామంది ప్రేక్షకులు ఆదరించారు. అది నాకు కాస్త ఊరటనిచ్చింది. నేను విమర్శల గురించి నా భర్తతో కూడా చర్చించలేదు. ఎందుకంటే అలా చర్చిస్తే దాని గురించి లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది’’ అని కియారా అడ్వాణీ చెప్పింది.

ఫేక్‌ మ్యారేజ్‌ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు.. కంగనా పోస్ట్‌ ఎవరినుద్దేశించో?

‘ఇక ట్రోలింగ్ విషయంలో నా భర్త సిద్ధార్థ్‌ మల్హోత్ర (Sidharth Malhotra) ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటాడు. పెళ్లితర్వాత కూడా విమర్శలు రాగా.. అతడు ధైర్యాన్నిచ్చాడు. ఇలా నెగెటివ్‌గా మాట్లాడేవాళ్లు ఎప్పుడూ ఉంటారని వాళ్లని పట్టించుకోకుండా ముందుకు సాగాలని సిద్ధార్థ్‌ సూచించాడు. వాటి గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంటే ఇంకా ఎక్కువగా విమర్శిస్తారని చెప్పాడు’ అని కియారా అడ్వాణీ వివరించింది.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాలో కియారా అడ్వాణీ  నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని