Malli Pelli: నరేశ్‌ - పవిత్రా లోకేశ్‌ల ‘మళ్లీ పెళ్లి’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. రిలీజ్‌ ఎప్పుడంటే?

Published : 03 May 2023 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు నరేశ్‌ (Naresh) తన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న సంఘటన ఆధారంగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’ (Malli Pelli). పవిత్రా లోకేశ్‌ (Pavitra Lokesh), వనితా విజయ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల తేదీని బుధవారం ఖరారు చేశారు. మే 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్‌ విడుదల చేశారు. నరేశ్‌, తన రెండో భార్య రమ్య రఘుపతి మధ్య విభేదాలు తలెత్తడం, ఆయన పవిత్రతో చనువుగా ఉండడం.. తెలిసిన విషయమే. ఈ పరిణామాల నేపథ్యంలో రూపొందిన సినిమాకావడంలో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వారిద్దరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు కొన్ని రోజుల క్రితం నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వాటిపై ఓ సందర్భంలో స్పందించిన నరేశ్‌ ‘ఓపిక పట్టండి. త్వరలోనే అన్ని వివరాలు చెబుతా’ అని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని