Allari Naresh: ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్‌ చేశా: అల్లరి నరేశ్‌

‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Published : 02 May 2024 12:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లరి నరేశ్‌ (Allari Naresh) హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa okkati adakku). ఫరియా అబ్దుల్లా కథానాయిక. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడివి శేష్‌ అతిథిగా హజరయ్యారు.

‘డైరెక్టర్‌గా మల్లికి ఇది తొలి సినిమా. నేను ఇప్పటివరకు 32మంది దర్శకులతో వర్క్‌ చేశాను. వాళ్లందరూ రిలీజ్‌కు ముందు ఒత్తిడి గురయ్యేవారు. కానీ, మల్లి మాత్రం నవ్వుతూ ఉన్నారు. అలా ఉండడం చాలా గ్రేట్‌. నిర్మాత ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఫరియా అబ్దుల్లాతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆమె ఉన్నత స్థానాలకు వెళ్లాలి. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా అందరినీ నవ్విస్తుంది. పెళ్లికాని వాళ్లు, సంబంధాలు వెతుకుతున్న వాళ్లు అందరూ ఈ చిత్రం చూడాలి. పెళ్లి పేరుతో జరుగుతోన్న మోసాలను ఇందులో చూపించాం. మీ అందరూ కూడా తెలుసుకోవాలి. మే3 థియేటర్‌కు వచ్చి సినిమా చూసి ఎంజాయ్‌ చేయండి’ అని అల్లరి నరేశ్‌ కోరారు.

అడివి శేష్‌ మాట్లాడుతూ..‘నరేశ్‌ నాకు మంచి ఫ్రెండ్‌. నా మొదటి సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఆయనే గెస్ట్‌గా వచ్చారు. నరేశ్‌ అంటే నాకు ఇంట్లో వాళ్లతో సమానం. ఫరియా అబ్దుల్లా మంచి అమ్మాయి. ఈ చిత్రబృందంలో చాలామంది నా కెరీర్‌ ప్రారంభంలో సపోర్ట్‌ చేశారు. అందుకే ఈ సినిమా నాకూ ప్రత్యేకమైనది. ఈ చిత్రం ప్రేక్షకాదరణ సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని