NTR: గోవా తీరం ‘దేవర’ గీతం

‘దేవర’గా థియేటర్లలో సందడి చేయనున్నారు ఎన్టీఆర్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని కొరటాల శివ రూపొందిస్తున్నారు. మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 23 Mar 2024 11:03 IST

‘దేవర’గా థియేటర్లలో సందడి చేయనున్నారు ఎన్టీఆర్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని కొరటాల శివ రూపొందిస్తున్నారు. మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ కథానాయిక. కల్యాణ్‌ రామ్‌ సమర్పిస్తున్నారు. సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ గోవాలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం ఈ చిత్ర సెట్స్‌ నుంచి ఓ వర్కింగ్‌ స్టిల్‌ పంచుకున్నారు. అందులో ఎన్టీఆర్‌ మాస్‌ లుక్‌లో మునుపెన్నడూ చూడని విధంగా కనిపించారు. ప్రస్తుతం తారక్‌పై ఓ మాంటేజ్‌ గీతాన్ని చిత్రీకరిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. దీనికి రాజు సుందరం నృత్యరీతులు అందిస్తున్నారు. తీరం నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తొలి భాగం ‘దేవర: పార్ట్‌ 1’ పేరుతో అక్టోబరు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకి అనిరుధ్‌ సంగీతమందిస్తుండగా.. రత్నవేలు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని