ఆట ఇంకా మొదలు కాలేదు మిత్రులారా: మాధవన్
తమిళ సినీ కథానాయకుడు ఆర్. మాధవన్.. డబ్బింగ్ చిత్రాలతో, ఒకట్రెండు తెలుగు చిత్రాల్లో నటించి తెలుగువారికి బాగా దగ్గరయ్యారు. దేశ విదేశాల్లో విద్యనభ్యసించి.. ప్రతిభగల విద్యార్థిగా పేరు తెచ్చుకున్న మాధవన్ తాజాగా సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల ఫలితాల గురించి
విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే ట్వీట్ చేసిన హీరో
చెన్నై: తమిళ సినీ కథానాయకుడు ఆర్. మాధవన్.. డబ్బింగ్ చిత్రాలతో, ఒకట్రెండు తెలుగు చిత్రాల్లో నటించి తెలుగువారికి బాగా దగ్గరయ్యారు. దేశ విదేశాల్లో విద్యనభ్యసించి.. ప్రతిభగల విద్యార్థిగా పేరు తెచ్చుకున్న మాధవన్ తాజాగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షల ఫలితాల గురించి ప్రస్తావిస్తూ విద్యార్థులకు స్ఫూర్తివంతమైన ట్వీట్ చేశారు. తనకూ బోర్డు పరీక్షల్లో తక్కువ మార్కులే వచ్చాయని, ఆట ఇంకా మొదలు కాలేదంటూ విద్యార్థులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
గత బుధవారం సీబీఎస్ఈ పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. పరీక్షల ఫలితాలు విద్యార్థులపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుంటాయి. మంచి మార్కులు వచ్చిన వారి గురించి పక్కన పెడితే.. తక్కువ మార్కులు వచ్చి, ఫెయిల్ అయ్యే విద్యార్థులు మనస్తాపానికి గురయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం ఆర్. మాధవన్ ఓ ట్వీట్ చేశారు. ‘‘బోర్డు పరీక్షల ఫలితాలు పొందిన వారందరికి నా అభినందనలు. ముఖ్యంగా అంచనాలకు మించి ఫలితాలు సాధించిన వారికి. ఇక మిగతా వారికి నేనో విషయం చెప్పాలనుకుంటున్నా. బోర్డు పరీక్షల్లో నా స్కోరు కేవలం 58శాతమే. ప్రియమైన మిత్రులారా.. ఆట ఇంకా మొదలు కాలేదు’’అని ట్వీట్ చేశారు. ఫన్నీ ఎమోజీలతో, తన చిత్రంలోని ఓ ఫొటోను జత చేశారు. మాధవన్ స్ఫూర్తివంతమైన ట్వీట్కు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. తమకు బోర్డు పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో కామెంట్ చేస్తున్నారు. బోర్డు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా.. మాధవన్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివారు. ఆ తర్వాత పబ్లిక్ స్పీకింగ్లో పీజీ పూర్తి చేశారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా రాణించారు. దేశవిదేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చిన మ్యాడీ.. ఆ తర్వాత మోడలింగ్ వైపు.. అటు నుంచి సినిమాల్లోకి వచ్చారు.
మాధవన్ నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా థియేటర్లో విడుదల కావాల్సి ఉండగా.. లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. మరోవైపు తన స్వీయదర్శకత్వంలో ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కూడా లాక్డౌన్తో ఆగిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్