‘సత్యమేవ జయతే 2’ విడుదల వాయిదా

జాన్‌ అబ్రహం, దివ్య ఖోస్ల కుమార్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సత్యమేవ జయతే 2’. మిలప్‌ జవేరి దర్శకత్వం వహిస్తున్నారు.

Published : 27 Apr 2021 12:48 IST

ముంబయి: జాన్‌ అబ్రహాం, దివ్య ఖోస్ల కుమార్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సత్యమేవ జయతే 2’. మిలప్‌ ఝవేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర విడుదలని వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతని మించింది ఏదీ లేదు. మన సినిమా సత్యమేవ జయతే 2 అనుకున్న రోజున కాకుండా మరో తేదీన వస్తుంది. మాస్క్‌ ధరించండి. మనకి మనం సురక్షితంగా ఉంటూ మనల్ని ప్రేమించే వారిని సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నిద్దాం. జై హింద్‌’ అని పేర్కొంది. టీ- సిరీస్, ఎమ్మీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై భూషణ్ కుమార్, కృష్ణన్‌ కుమార్‌, నిఖిల్‌ అడ్వాణి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 13న విడుదల కావాల్సి ఉంది. గతంలో వచ్చిన ‘సత్యమేవ జయతే’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని