Will Jacks: పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా ఆరు ఓటములను చవిచూసిన బెంగళూరు ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. అయితే, మళ్లీ పుంజుకుని హైదరాబాద్, గుజరాత్ను వరుస మ్యాచుల్లో చిత్తు చేసి అద్భుత విజయాలను నమోదు చేసింది. జీటీపై వీరోచిత ఇన్నింగ్స్ ఆడి విల్ జాక్స్ (Will Jacks) హీరోగా నిలిచాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించిన అతడు.. 50 నుంచి 100 పరుగుల మార్క్ చేరుకొనేందుకు కేవలం 10 బంతులనే తీసుకున్నాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ బౌలింగ్లో నాలుగు సిక్స్లు బాదేయడం ఇన్నింగ్స్కే హైలైట్. మ్యాచ్ అనంతరం తన ఆటతీరుపై జాక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘భారీ విజయం సాధించడం అద్భుతంగా అనిపిస్తోంది. ఫాఫ్, విరాట్ కోహ్లీ శుభారంభం వల్లే సులువుగా మ్యాచ్ను గెలిచాం. క్రీజ్లోకి వచ్చిన తర్వాత కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా. అప్పుడు విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడి నామీద ఒత్తిడి లేకుండా చేశాడు. సరిగ్గా రెండు ఓవర్లు మావైతే మ్యాచ్ను త్వరగా ముగించేయొచ్చని టైమౌట్లో మాట్లాడుకున్నాం. మేం అనుకున్న విధంగానే జరిగింది. స్పిన్ బౌలింగ్లో ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు పాజిటివ్ కోణంలో ఎటాకింగ్ చేశా. మోహిత్ బౌలింగ్లోనూ భారీగా పరుగులు రాబట్టడంతో రిలాక్స్ కాగలిగా. మిగతా మ్యాచుల్లోనూ మేం గెలిచి ప్రత్యర్థులకు సవాల్ విసురుతాం. విరాట్తో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేను. ఇవాళ నాకు అదృష్టం కూడా కలిసొచ్చింది. తొలి 17 పరుగులను 17 బంతుల్లో చేసిన నేను ఇలా హిట్టింగ్ చేయడానికి అవతల క్రీజ్లో దిగ్గజ క్రికెటర్ ఉండటమే కారణం. కోహ్లీ నాకు కావాల్సినంత సమయం ఇచ్చాడు. ఇంకాస్త త్వరగా పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని జాక్స్ తెలిపాడు.
16 ఓవర్లలో అనుకోలేదు: డుప్లెసిస్
‘‘మేం బౌలింగ్ చేసేటప్పుడే ఈ పిచ్పై ఎంతటి స్కోరునైనా ఛేదించవచ్చని భావించాం. కానీ, 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ముగిస్తామని అనుకోలేదు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో చాలా మెరుగయ్యాం. టోర్నీ ప్రారంభంలో విజయాలకు చాలా దూరంగా ఉన్నాం. ఇప్పుడు మాత్రం మా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. టీ20ల్లో స్కోరు బోర్డును చూశాక.. బౌలర్లూ మీరేం చేస్తారు? అనే పరిస్థితి ఇప్పుడు ఉండటం లేదు. ఫార్మాట్ చాలా మారిపోతోంది. కోల్కతాతో మ్యాచ్లో తొలిసారి మేం అనుకున్న విధంగా బౌలింగ్ చేయగలిగాం. ఆ తర్వాత అదే ఉత్సాహాన్ని కొనసాగించాం’’ అని డుప్లెసిస్ వ్యాఖ్యానించాడు.
ఇలాగే ఆడితే..
ప్రస్తుతం ఆరు పాయింట్లతో పట్టికలో అట్టడుగున ఉన్న బెంగళూరుకు ఇంకా నాలుగు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్పై సాధించిన భారీ విజయంలా.. ఆ నాలుగింట్లోనూ గెలిస్తే సీజన్ను గౌరవప్రదంగా ముగించే అవకాశం ఉంటుంది. అప్పుడు 14 పాయింట్లు బెంగళూరు ఖాతాలోకి వస్తాయి. ఇతర జట్ల సమీకరణాలతో ప్లేఆఫ్స్ అవకాశమూ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
Bengaluru vs Chennai - Rain: బెంగళూరు, చెన్నై మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది. -
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు సన్నాహకం జూన్ 1న బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్తో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఐదు రోజులకే తొలి పోరు జరగనుంది. -
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
భారత క్రికెట్ రూపురేఖలను మార్చడంలో ఎంఎస్ ధోనీ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అలాగే విరాట్ వంటి ఆటగాళ్లను మెరుగ్గా రాణించడంలోనూ ధోనీదే ముఖ్య భూమిక. ఈ మాట అంటున్నది భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. -
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ఇండియాకు ఎంపికైన ఆటగాళ్లు త్వరలోనే అమెరికాలో అడుగు పెట్టనున్నారు. అందరూ ఒకేసారి కాకుండా రెండు విడతలుగా వెళ్లే అవకాశం ఉంది. -
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోనీ కేవలం చివరి ఓవర్లలోనే బ్యాటింగ్కు వస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరుతో మ్యాచ్లో మరోసారి ధోనీ బ్యాటింగ్ చూసే అవకాశం రావాలని అభిమానుల ఆకాంక్ష. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
ఐపీఎల్ చివరి దశకు వరుణుడు అడ్డుగా మారాడు. కీలకమైన సమయంలో మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నాడు. -
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా నాణ్యమైన క్రికెట్ను ఆడటంలో విఫలమైనట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు. లఖ్నవూ చేతిలో ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. -
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 214 పరుగులు చేయగా.. ముంబయి 196 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. చివరి మ్యాచ్లో ముంబయిని ఓడించినప్పటికీ లఖ్నవూ ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
లఖ్నవూతో మ్యాచ్ సందర్భంగా ముంబయి స్టార్ రోహిత్ శర్మ చేసిన ఓ విజ్ఞప్తి నెట్టింట వైరల్గా మారిపోయింది. -
పూరన్ దంచెన్
ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్ సీజన్ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. -
వానా వానా వద్దప్పా!
అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! -
సెమీస్లో సాత్విక్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
అప్పటి నుంచే ఆ ఆలోచన
అఫ్గానిస్థాన్తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్ సునీల్ ఛెత్రి చెప్పాడు. -
ఆర్జనలో రొనాల్డో నం.1
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. -
మను బాకర్ జోరు
ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మను బాకర్ జోరు కొనసాగుతోంది. -
పర్వీన్పై నిషేధం.. చేజారిన ఒలింపిక్ బెర్తు
బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. -
నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే
తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. -
ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. -
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు