Will Jacks: పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా ఆరు ఓటములను చవిచూసిన బెంగళూరు ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. అయితే, మళ్లీ పుంజుకుని హైదరాబాద్, గుజరాత్ను వరుస మ్యాచుల్లో చిత్తు చేసి అద్భుత విజయాలను నమోదు చేసింది. జీటీపై వీరోచిత ఇన్నింగ్స్ ఆడి విల్ జాక్స్ (Will Jacks) హీరోగా నిలిచాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించిన అతడు.. 50 నుంచి 100 పరుగుల మార్క్ చేరుకొనేందుకు కేవలం 10 బంతులనే తీసుకున్నాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ బౌలింగ్లో నాలుగు సిక్స్లు బాదేయడం ఇన్నింగ్స్కే హైలైట్. మ్యాచ్ అనంతరం తన ఆటతీరుపై జాక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘భారీ విజయం సాధించడం అద్భుతంగా అనిపిస్తోంది. ఫాఫ్, విరాట్ కోహ్లీ శుభారంభం వల్లే సులువుగా మ్యాచ్ను గెలిచాం. క్రీజ్లోకి వచ్చిన తర్వాత కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా. అప్పుడు విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడి నామీద ఒత్తిడి లేకుండా చేశాడు. సరిగ్గా రెండు ఓవర్లు మావైతే మ్యాచ్ను త్వరగా ముగించేయొచ్చని టైమౌట్లో మాట్లాడుకున్నాం. మేం అనుకున్న విధంగానే జరిగింది. స్పిన్ బౌలింగ్లో ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు పాజిటివ్ కోణంలో ఎటాకింగ్ చేశా. మోహిత్ బౌలింగ్లోనూ భారీగా పరుగులు రాబట్టడంతో రిలాక్స్ కాగలిగా. మిగతా మ్యాచుల్లోనూ మేం గెలిచి ప్రత్యర్థులకు సవాల్ విసురుతాం. విరాట్తో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేను. ఇవాళ నాకు అదృష్టం కూడా కలిసొచ్చింది. తొలి 17 పరుగులను 17 బంతుల్లో చేసిన నేను ఇలా హిట్టింగ్ చేయడానికి అవతల క్రీజ్లో దిగ్గజ క్రికెటర్ ఉండటమే కారణం. కోహ్లీ నాకు కావాల్సినంత సమయం ఇచ్చాడు. ఇంకాస్త త్వరగా పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని జాక్స్ తెలిపాడు.
16 ఓవర్లలో అనుకోలేదు: డుప్లెసిస్
‘‘మేం బౌలింగ్ చేసేటప్పుడే ఈ పిచ్పై ఎంతటి స్కోరునైనా ఛేదించవచ్చని భావించాం. కానీ, 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ముగిస్తామని అనుకోలేదు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో చాలా మెరుగయ్యాం. టోర్నీ ప్రారంభంలో విజయాలకు చాలా దూరంగా ఉన్నాం. ఇప్పుడు మాత్రం మా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. టీ20ల్లో స్కోరు బోర్డును చూశాక.. బౌలర్లూ మీరేం చేస్తారు? అనే పరిస్థితి ఇప్పుడు ఉండటం లేదు. ఫార్మాట్ చాలా మారిపోతోంది. కోల్కతాతో మ్యాచ్లో తొలిసారి మేం అనుకున్న విధంగా బౌలింగ్ చేయగలిగాం. ఆ తర్వాత అదే ఉత్సాహాన్ని కొనసాగించాం’’ అని డుప్లెసిస్ వ్యాఖ్యానించాడు.
ఇలాగే ఆడితే..
ప్రస్తుతం ఆరు పాయింట్లతో పట్టికలో అట్టడుగున ఉన్న బెంగళూరుకు ఇంకా నాలుగు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్పై సాధించిన భారీ విజయంలా.. ఆ నాలుగింట్లోనూ గెలిస్తే సీజన్ను గౌరవప్రదంగా ముగించే అవకాశం ఉంటుంది. అప్పుడు 14 పాయింట్లు బెంగళూరు ఖాతాలోకి వస్తాయి. ఇతర జట్ల సమీకరణాలతో ప్లేఆఫ్స్ అవకాశమూ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ vs లఖ్నవూ.. ప్లేఆఫ్స్పై నేటి మ్యాచ్ ఫలితం ప్రభావమెంత?
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఒక్క జట్టు మాత్రమే ఇప్పటి వరకు క్వాలిఫై అయ్యింది. -
60 ఏళ్లు మించొద్దు.. వేతనం ఇలా - హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
BCCI: టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ప్రకటన ఇచ్చింది. వేతనం, అర్హత వివరాలను వెల్లడించింది. -
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!
ముంబయి ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో ఈ ఐపీఎస్ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. మరోవైపు హార్దిక్ నాయకత్వంపై ఆ జట్టు సభ్యులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. -
టీ20 వరల్డ్కప్.. హార్దిక్ను ఎంపిక చేయడం రోహిత్కు ఇష్టం లేదా..?
టీ20 ప్రపంకప్ కోసం టీమ్ఇండియా రోహిత్ సారథ్యంలో జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్కు డిప్యూటీగా హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నాడు. -
వర్షం వచ్చింది.. కథ ముగిసింది: ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న సమయంలో కీలకమైన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిణుకుమిణుకుమంటున్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. -
ఎవరివో మూడు బెర్తులు?
ఐపీఎల్-17లో కోల్కతా నైట్రైడర్స్కు ప్లేఆఫ్స్ బెర్తు ఖరారైంది. ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. -
థాయ్లాండ్ టైటిల్పై సాత్విక్ జోడీ గురి
పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి.. థాయ్లాండ్ ఓపెన్ ప్రపంచ సూపర్ 500 బ్యాడ్మింటన్ టైటిల్పై గురిపెట్టారు. -
నార్వే చెస్ టోర్నీకి ప్రజ్ఞానంద, హంపి
భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, కోనేరు హంపి, వైశాలి నార్వే చెస్ టోర్నమెంట్లో పోటీపడనున్నారు. -
నిఖత్, మీనాక్షి, అనామిక శుభారంభం
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భారత క్రీడాకారిణులు నిఖత్ జరీన్ (52 కేజీలు), మీనాక్షి (48 కేజీలు) అనామిక (50 కేజీలు) శుభారంభం చేశారు. -
అదేం పెద్ద గొడవ కాదు
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా మధ్య జరిగింది పెద్ద గొడవేం కాదని ఎల్ఎస్జీ సహాయ కోచ్ లాన్స్ క్లూసెనర్ అన్నాడు. -
వాళ్లు వెళ్లిపోతున్నారు
టీ20 ప్రపంచకప్ ముందు పాకిస్థాన్తో జరిగే టీ20 సిరీస్ కోసం రావాల్సిందిగా ఈసీబీ ఆదేశించడంతో ఐపీఎల్-17లో ఆడుతున్న కొంతమంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్వదేశానికి బయల్దేరుతున్నారు. -
మహిళల షాట్పుట్లో అభా జాతీయ రికార్డు
జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మహిళల షాట్పుట్లో అభా ఖతువా జాతీయ రికార్డు నెలకొల్పింది. -
కుర్రాళ్లూ.. టెస్టు క్రికెట్ ఆడండి
యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడడంపై దృష్టి సారించాలని.. సుదీర్ఘ ఫార్మాట్లో రాణిస్తేనే అసలైన గౌరవం దక్కుతుందని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ అన్నాడు. -
మెరిసిన ‘లక్ష్య’ శ్రీనివాస్
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ సత్తా చాటాడు. -
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
కెప్టెన్ కేఎల్ రాహుల్పై ఆ జట్టు యజమాని ఆగ్రహం వ్యక్తం చేసిన అంశంపై లఖ్నవూ టీమ్ స్పందించింది. -
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
ఐపీఎల్ 2024 (IPL)సీజన్ చివరి దశకు చేరుకున్నా ఇప్పటివరకు ఒకే జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంది. మిగతా మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
జాబ్ మార్కెట్ పైకి ఏఐ ‘సునామీ’.. IMF చీఫ్ వ్యాఖ్యలు!
-
చైనాకు చెక్ పెట్టేందుకు ‘గ్రేట్షార్క్’, ‘మాంట రే’ సిద్ధం..!
-
ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్
-
మూడో రోజూ లాభాల్లో సూచీలు.. 22,200 ఎగువకు నిఫ్టీ
-
టాటా ప్లేతో అమెజాన్ జట్టు.. ఇక DTHలోనూ ప్రైమ్ వీడియో
-
తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు