Tollywood: అగ్రతారల ఆధిపత్యమెంత?
2023కి వీడ్కోలు పలికి.. 2024కు స్వాగతం పలికేందుకు మరో ఇరవై రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో బాక్సాఫీస్ పద్దును సరిచూసుకునేందుకు చిత్రసీమ సమాయత్తమైంది. ఈ పద్దులో తొలి పేజీ అగ్ర తారలదే.
2023కి వీడ్కోలు పలికి.. 2024కు స్వాగతం పలికేందుకు మరో ఇరవై రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో బాక్సాఫీస్ పద్దును సరిచూసుకునేందుకు చిత్రసీమ సమాయత్తమైంది. ఈ పద్దులో తొలి పేజీ అగ్ర తారలదే. వీరి జోరు ఈ ఏడాదంతా కనిపిస్తూనే ఉంది. సంక్రాంతి మొదలు.. దీపావళి వరకు అగ్ర కథానాయకుల చిత్రాలు సీజన్ల వారీగా సందడి చేశాయి. ఇందులో కొన్ని భారీ విజయాలతో బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపించగా.. మరికొన్ని అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి. మరి ఈ ఏడాది ఎవరికి తీపి గుర్తుగా మిగిలింది.. ఎవరికి చేదు ఫలితాన్ని అందించింది? తెలుసుకుందాం పదండి..
చిత్రసీమను బలంగా నిలబెట్టడంలో అగ్రతారల చిత్రాలే కీలకంగా నిలుస్తుంటాయి. బాక్సాఫీస్ లెక్కలు మార్చాలన్నా.. రికార్డుల మోత మోగించాలన్నా.. హౌస్ఫుల్ బోర్డులతో థియేటర్లను కళకళలాడించాలన్నా అగ్ర కథానాయకుల సినిమా బరిలోకి దిగాల్సిందే. ఏటా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూనే ఈసారి కూడా సంక్రాంతి నుంచే బాక్సాఫీస్ ముందు అగ్రజుల ఆధిపత్యం మొదలైంది. ఈసారి పండగ బరిలో తొలుత కాలు మోపిన కథానాయకుడిగా నిలిచారు నందమూరి బాలకృష్ణ. ఆయన ‘వీరసింహారెడ్డి’గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చి.. మాస్ యాక్షన్ హంగామాతో థియేటర్లలో విజిల్స్ కొట్టించారు. భారీ వసూళ్లతో బాక్సాఫీస్కు నూతనోత్తేజాన్ని అందించారు. ద్వితీయార్ధంలోనూ ఆయన ఇదే జోరును కొనసాగిస్తూ ‘భగవంత్ కేసరి’గా దసరాకి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడీ విజయోత్సాహంలోనే తన 109వ చిత్రాన్ని పట్టాలెక్కించారు. అగ్ర కథానాయకుడు చిరంజీవికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు లభించాయి. ఆయన గతేడాదిలాగే ఈసారి కూడా రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించారు. సంక్రాంతి బరిలో ‘వాల్తేరు వీరయ్య’గా సందడి చేసి విజయాన్ని అందుకోగా.. ద్వితీయార్ధంలో ‘భోళా శంకర్’తో చేదు ఫలితాన్ని అందుకున్నారు. ప్రస్తుతం విజయమే లక్ష్యంగా ఓ సోషియో ఫాంటసీ కథాంశంతో సెట్స్పై ముస్తాబవుతున్నారు. ‘మెగా 156’ వర్కింగ్ టైటిల్తో వశిష్ఠ రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలోకి రానున్నట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. ఈ ఏడాదంతా వరుస సినిమాలతోనూ సెట్స్పై తీరిక లేకుండా గడిపారు. కానీ, వాటిలో నుంచి ఒక్క చిత్రమే బాక్సాఫీస్ ముందుకొచ్చింది. అదే సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ‘బ్రో’. ఇందులో కాలస్వరూపుడిగా పవన్ చేసిన సందడి అభిమానుల్ని మెప్పించినా.. ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లు సాధించలేకపోయింది. ప్రస్తుతం పవన్ నుంచి ‘ఓజి’, ‘ఉస్తాద్ భగత్సింగ్’, ‘హరి హర వీరమల్లు’ సినిమాలు రావాల్సి ఉంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాలన్నీ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల్ని పలకరించే అవకాశముంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందు జోరు చూపిస్తున్నారు కథానాయకుడు రవితేజ. ఆయన సంక్రాంతి బరిలో చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ రూపంలో ఓ విజయాన్ని అందుకున్నారు. కానీ, ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన రెండు సినిమాలు ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ బాగా నిరుత్సాహ పరిచాయి. ప్రస్తుతం రవితేజ ‘ఈగల్’గా సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 13న థియేటర్లలోకి రానుంది.
ప్రభాస్ హిట్ ట్రాక్ ఎక్కేనా?
‘బాహుబలి’, ‘సాహో’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు కథానాయకుడు ప్రభాస్. అందుకే ప్రస్తుతం ఆయన నుంచి వచ్చే ప్రతి చిత్రంపైనా భారీ అంచనాలు నెలకొని ఉంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ప్రభాస్ నుంచి ‘ఆదిపురుష్’ చిత్రం బయటకొచ్చింది. కానీ, అది బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. అయినా సరే ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడాయన విజయమే లక్ష్యంగా ‘సలార్’తో అలరించేందుకు సమాయత్తమవుతున్నారు. ‘కేజీఎఫ్’ సిరీస్ విజయాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం కావడంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈనెల 22న థియేటర్లలోకి రానుంది. దీంతో ప్రభాస్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని ప్రేక్షకులతో పాటు ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘కల్కి 2898ఎ.డి.’ చిత్రంతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
ఏప్రిల్ 28న విడుదలై, ఘన విజయం అందుకున్న టాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా.. -
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
మహేష్బాబు, పూరి జగన్నాథ్ల కాంబినేషన్కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్మెన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. -
ఉన్నతమైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసొస్తున్నాయి
ఎదురు చూపులకి తెర పడింది. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల ఖరారైంది. మేలైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసి వస్తున్నాయంటూ జూన్ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు శనివారం ప్రకటించాయి. -
ప్రేమ వివాహమే చేసుకుంటా!
‘జాతిరత్నాలు’ చిత్రంతో తొలి అడుగులోనే సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది ఫరియా అబ్దుల్లా. ఇప్పుడామె అల్లరి నరేశ్తో కలిసి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’తో అలరించేందుకు సిద్ధమైంది. -
కృష్ణ జయంతికి ‘హరోం హర’
‘హరోం హర’తో సినీప్రియుల్ని పలకరించనున్నారు సుధీర్ బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. -
‘ప్రేమికుడు’ మళ్లీ వస్తున్నాడు
ప్రభుదేవా - శంకర్ కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘ప్రేమికుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని మే 1న రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు రమణ, మురళీధర్ రెడ్డి ప్రకటించారు. -
ఆ లాజిక్తోనే ప్రసన్న వదనం తీశాడు
‘‘నేను తీసిన ‘100%లవ్’ మొదలుకొని నా ప్రతి సినిమాకీ పనిచేశాడు అర్జున్. తను హాలీవుడ్లో ఉండి ఉంటే మరో స్థాయిలో సినిమాలు తీసేవాడు. -
ఈసారి శివాలెత్తిపోద్ది
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. దీని గురించి నేనొక్కటే చెప్తాను. ఈసారి శివాలెత్తిపోద్ది’’ అన్నారు విష్వక్ సేన్. ఆయన హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. -
మూడు జంటల కథ.. ఖేల్ ఖేల్ మే
వినోదాన్ని పంచే ఏ సినిమా కోసమైనా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ జాబితాలోకే చేరే ‘ఖేల్ ఖేల్ మే’ కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్న అభిమానులకు తీపి కబురు వినిపించింది చిత్రబృందం. -
అవి నా జీవితంలో చీకటి రోజులు!
‘‘నా జీవితంలోనే నేను అనుభవించిన ఓ చీకటి దశ ఇద’’ని అంటోంది నాయిక ప్రియాంక చోప్రా. బాలీవుడ్లోనే కాదు.. హాలీవుడ్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. -
తండ్రీ తనయుల సంఘర్షణ
తన కొడుకు ప్రయోజకుడై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించిన ఓ తండ్రి... ‘నాన్నలందరూ ఇంతే, అర్థం చేసుకోర’ంటూ బాధపడే ఓ తనయుడు... -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..