Tollywood: డల్లాస్‌లో తారల క్రికెట్‌

‘క్రికెట్‌ అంటే మా అందరికీ ఆసక్తి. మంచి పని కోసం మేం చాలా సార్లు క్రికెట్‌ ఆడాం. మరోసారి డల్లాస్‌లో క్రికెట్‌ ఆడనుండటం ఆనందంగా ఉంద’న్నారు కథా నాయకుడు శ్రీకాంత్‌. ఆయన టాలీవుడ్‌ క్రికెట్‌...

Updated : 11 Apr 2022 09:03 IST

‘క్రికెట్‌ అంటే మా అందరికీ ఆసక్తి. మంచి పని కోసం మేం చాలా సార్లు క్రికెట్‌ ఆడాం. మరోసారి డల్లాస్‌లో క్రికెట్‌ ఆడనుండటం ఆనందంగా ఉంద’న్నారు కథా నాయకుడు శ్రీకాంత్‌. ఆయన టాలీవుడ్‌ క్రికెట్‌  అసోసియేషన్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ ఎలైట్‌ మీడియా నేతృత్వంలో అమెరికాలోని డల్లాస్‌లో టాలీవుడ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కీ, యూనివర్సల్‌ ఎక్స్‌.ఎల్‌ జట్టుకీ మధ్య సెప్టెంబర్‌లో ఛారిటీ క్రికెట్‌ మ్యాచ్‌ని నిర్వహించనున్నారు. యూనివర్సల్‌ ఎక్స్‌.ఎల్‌ జట్టుని ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా ఎంపిక చేయనున్నారు. సినీ తారలతో క్రికెట్‌ ఆడాలనుకునే ఔత్సాహికులు ఎవరైనా ఈ బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చని ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో రాజీవ్‌ ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈస్ట్‌వెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌.కామ్‌ వెబ్‌సైట్‌లో వీడియో ద్వారా పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సెప్టెంబర్‌ 24, 25 తేదీల్లో మ్యాచ్‌లు ఉంటాయని, ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు తరుణ్‌, తమన్‌, సుధీర్‌బాబు, ప్రిన్స్‌, భూపాల్‌తోపాటు.. ఎలైట్‌ మీడియా అధినేత మురళీమోహన్‌, ఈస్ట్‌ వెస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని