Swathimuthyam: ‘స్వాతిముత్యం’ ముందే వచ్చేస్తోంది.. ఓటీటీ విడుదల తేదీ మారింది

‘స్వాతిముత్యం’ సినిమా ఓటీటీలోకి అతి త్వరలోనే రాబోతుంది. చెప్పిన డేట్‌ కంటే ముందే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఓటీటీ ‘ఆహా’ తెలిపింది.

Published : 20 Oct 2022 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెల్లకొండ గణేశ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’ (Swathimuthyam). ఈ సినిమాని ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఓటీటీ ‘ఆహా’ (Aha) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా తేదీ మారింది. సినీ ప్రియుల డిమాండ్‌ మేరకు ఆ సినిమాని నాలుగు రోజుల ముందుగానే అంటే అక్టోబరు 24న విడుదల చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌కు లక్ష్మణ్‌ కె. కృష్ణ దర్శకత్వం వహించారు. నరేశ్‌, రావు రమేశ్‌, ప్రగతి, సురేఖా వాణి, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం దసరా కానుకగా థియేటర్లలో విడుదలై మంచి విజయం అందుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు