Crazy Uncles: ‘ఆర్ఆర్ఆర్’ అంకుల్స్.. వినోదం, సందేశం ఇస్తారు: మనో
మనో, రాజా రవీంద్ర, భరణి, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకుడు. ఈ సినిమా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు మనో. ఆ సంగతులివీ...
ఇంటర్నెట్ డెస్క్: మనో, రాజా రవీంద్ర, భరణి, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకుడు. ఈ సినిమా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు మనో. ఆ సంగతులివీ...
గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది
నటనలో కావాలని గ్యాప్ తీసుకోలేదు... వచ్చిందంతే. ‘క్రేజీ అంకుల్స్’ అనే ఓ మంచి కథతో మళ్లీ మీ ముందుకొస్తున్నా. అందరూ హాయిగా నవ్వుకునేలా రూపొందించిన చిత్రమిది. 50 ఏళ్లు దాటిన ముగ్గురు స్నేహితుల కథ ఇది. ఒకరు ఫైనాన్సియర్, ఒకరు బిల్డర్, ఒకరు బంగారం వ్యాపారి. రాజు, రెడ్డి, రావు అనేవి పాత్రల పేర్లు. అనుకోకుండా అది ‘ఆర్ఆర్ఆర్’ అయింది. వయసు రీత్యా తమ తమ ఇంట్లో ప్రాధాన్యత తగ్గిపోవడంతో మరోచోట వినోదం పొందాలనుకుంటారు ముగ్గురు మిత్రులు. ఈ క్రమంలో ఓ సింగర్కి ఆకర్షితులవుతారు. ఆమెతో పరిచయం వల్ల వీరికి ఎదురైన సమస్యలేంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అనేది కథాంశం. మిగిలిన రెండు పాత్రలకంటే నా పాత్ర ఎక్కువగా నవ్విస్తుంది. నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో దాదాపు అదే తెరపై కనిపిస్తుంది. ఇందులో కామెడీ మాత్రమే కాదు సందేశమూ ఉంది. ఇప్పటి తరం తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. వయసు మీద పడిన తర్వాత ఏం చేయకూడదో, ఏం చేయాలో తదితర అంశాలు ఈ సినిమాతో అర్థమవుతాయి.
ఆ నమ్మకంతోనే..
మనమంతా విజయం వస్తుందనే నమ్మకంతోనే ప్రతి పనినీ ప్రారంభిస్తాం. ఆ నమ్మకంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించి, థియేటర్లలో విడుదల చేస్తున్నాం. మావంతు ప్రయత్నించాం.. ఫలితాన్ని ప్రేక్షకులు ఇవ్వాల్సిందే. ఒకప్పటి కామెడీ చిత్రాల్నీ, ఇప్పటికి కామెడీ సినిమాలనీ పోల్చి చూస్తే ఇప్పటి వారు కొంచెం బెటర్గా ఆలోచిస్తున్నారనిపిస్తుంది. మైండ్ సెట్ని బట్టే మంచీచెడూ అనేది ఉంటుంది.
బాల నటుడిగా..
ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు నన్ను బాల నటుడిగా పరిచయం చేశారు. ‘రంగూన్ రౌడీ’, ‘నీడ’, ‘కేటుగాడు’ తదితర చిత్రాల్లో నటించాను. మాది కళాకారుల కుటుంబం. దాంతో చిన్నప్పటి నుంచే సంగీతంపై ఇష్టం పెరిగింది. అప్పట్లో అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అలా 13 భాషల్లో సుమారు 25000 పాటలు పాడాను. ప్రతి గాయకుడిలోనూ ఓ నటుడు ఉంటాడు. నటుడిలానే గాయకుడూ తన స్వరంతో నవ రసాలు పలికించాలి.
అలాంటి పాత్రలు పోషించాలనుంది..
స్వతహాగా నాకు కామెడీ పాత్రలంటే ఇష్టం. వాటిల్లో అయితే నేను ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ నటిస్తా. జగ్గయ్య, సత్యనారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారిలా నాకూ విభిన్న పాత్రలు పోషించాలనుంది. ప్రస్తుతానికి కొన్ని కథలు వింటున్నాను. ఇంకా ఖరారు కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM