Director sujeeth: వర్షంలో బండి నెట్టుకుంటూ... ఆ కథ ఆలోచించా!
ఫ్లాష్బ్యాక్
హైదరాబాద్: ‘రన్ రాజా రన్’... తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు సుజీత్. ఈ సినిమా ప్రభావంతోనే సుజీత్కు ప్రభాస్ ‘సాహో’ అవకాశమిచ్చారు. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కింది. దీని తర్వాత ఎలాంటి ప్రాజెక్టు ప్రకటించని సుజీత్ ఈటీవీ ప్లస్లో ప్రసారమయ్యే ‘నీకు మాత్రమే చెబుతా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కెరీర్ తొలి నాళ్లలో తనకు ఎదురైనా ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘అవకాశాల కోసం బాగా తిరుగుతూ... ఓ మంచి ప్రేమ కథ రాసుకున్నా. తొలి చిత్రం ఇదైతే బాగా ఉంటుందని భావించా. ‘రన్ రాజా రన్’ కంటే ముందు నిర్మాతలకు ఇది వినిపించా. ఫస్ట్ హాఫ్ వారికి బాగా నచ్చింది. సెకండాఫ్ కోసం దాదాపు 5 నెలలు రాత్రింబవళ్లు ఆలోచించి మంచి వర్షన్ రాశా. ప్రొడక్షన్ ఆఫీసుకు వెళ్లి... సెకండాఫ్ వినిపించా... వాళ్లు సూపర్ అన్నారు. ఇక ప్రాజెక్టు ఓకే అయ్యిందన్న ఆనందంతో బండిపై బయలుదేరా. మార్గమధ్యలోనే.. ఫోన్ బాగా రింగవుతోంది. బండి పక్కకు ఆపి లిఫ్ట్ చేశా. ‘చూడమ్మా ఈ కథకు బడ్జెట్ ఎక్కువయ్యేట్లు ఉంది.. వేరే కథ ఉంటే చెప్పు’ అన్నారు. ఒక్కసారిగా మైండ్ ఆగిపోయింది. అప్పుడే వర్షం మొదలైంది. అక్కడే రోడ్డు పక్కన కూర్చొని మూడు గంటల పాటు ఏడ్చాను. వెన్నెల కిషోర్కు ఫోన్ చేశాను. అతను కాస్త ధైర్యం ఇచ్చాడు. ‘నువ్వు షార్ట్ ఫిల్మ్ గంటలో రాయగలవు... సినిమా ఒక రోజులో రాయలేవా?’ అని నన్ను ప్రోత్సహించాడు. ఆ ఉత్సాహంలో జోరుగా అక్కడి నుంచి లేచి బయలు దేరదామని బండి స్టార్ట్ చేస్తే కాలేదు. పెట్రోల్ అయిపోయింది. చేతిలో చిల్లగవ్వ లేదు. జోరున వాన. ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు. బండిని అలా నెట్టుకుంటూ జూబ్లీహిల్స్ నుంచి ముషీరాబాద్ వరకూ వచ్చాను. ఆ ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు... బాధ, కోపం, కసి అన్నీ రకాల ఫీలింగ్స్ వచ్చాయి. అదే ఆలోచనలతో ఇంటికి వచ్చి తల తుడుచుకున్నా... అంతే ‘రన్ రాజా రన్’ కథ ఫ్లాష్ అయ్యింది. వెంటనే ప్రొడక్షన్ వాళ్లకు ఫోన్ చేసి ‘సంవత్సరం నుంచి ఓ కథ రాస్తున్నా... చెప్పమంటారా?’ అని అడిగా. రేపు వచ్చేయ్ అన్నారు. నాకు కొంచెం ఇంట్లో ఇబ్బంది ఉంది మూడు రోజుల్లో వస్తానని చెప్పి... ‘రన్ రాజా రాన్’ కథ మొత్తం రాసి తీసుకెళ్లా. ఒక్క డైలాగ్ కూడా మార్చకుండా... ఓకే చేశారు. ఒక ఓటమి వచ్చిందని బాధ పడకూడదు... మరో ప్రయత్నం మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది.’’
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
NITI Aayog: సమష్టి కృషితోనే కరోనాను కట్టడి చేశాం.. రాష్ట్రాలకు ప్రధాని కితాబు
-
India News
Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
-
General News
Jagan: రైతులు, విద్యార్థుల కోసం ఎంతో చేశాం.. నీతి ఆయోగ్ సమావేశంలో జగన్
-
Sports News
IND vs WI : విండీస్తో ఐదో టీ20.. నామమాత్రమే కానీ.. అందుకు ఇదే చివరి సన్నాహకం!
-
World News
Taiwan: తైవాన్పై గురిపెట్టిన డ్రాగన్.. రెచ్చిపోతున్న చైనా..
-
Sports News
Nikhat Zareen : నిఖత్ పసిడి పంచ్.. నాలుగో స్థానానికి భారత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
- Allu Arjun: కల్యాణ్రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- నిమిషాల్లో వెండి శుభ్రం!
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Pooja Hegde: ‘సీతారామం’ హిట్.. ‘పాపం పూజా’ అంటోన్న నెటిజన్లు
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?