Director sujeeth: వర్షంలో బండి నెట్టుకుంటూ... ఆ కథ ఆలోచించా!
‘రన్ రాజా రన్’... తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు సుజీత్. ఈ సినిమా ప్రభావంతోనే సుజీత్కు ప్రభాస్ ‘సాహో’ అవకాశమిచ్చారు. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కింది. దీని తర్వాత ఎలాంటి....
ఫ్లాష్బ్యాక్
హైదరాబాద్: ‘రన్ రాజా రన్’... తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు సుజీత్. ఈ సినిమా ప్రభావంతోనే సుజీత్కు ప్రభాస్ ‘సాహో’ అవకాశమిచ్చారు. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కింది. దీని తర్వాత ఎలాంటి ప్రాజెక్టు ప్రకటించని సుజీత్ ఈటీవీ ప్లస్లో ప్రసారమయ్యే ‘నీకు మాత్రమే చెబుతా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కెరీర్ తొలి నాళ్లలో తనకు ఎదురైనా ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘అవకాశాల కోసం బాగా తిరుగుతూ... ఓ మంచి ప్రేమ కథ రాసుకున్నా. తొలి చిత్రం ఇదైతే బాగా ఉంటుందని భావించా. ‘రన్ రాజా రన్’ కంటే ముందు నిర్మాతలకు ఇది వినిపించా. ఫస్ట్ హాఫ్ వారికి బాగా నచ్చింది. సెకండాఫ్ కోసం దాదాపు 5 నెలలు రాత్రింబవళ్లు ఆలోచించి మంచి వర్షన్ రాశా. ప్రొడక్షన్ ఆఫీసుకు వెళ్లి... సెకండాఫ్ వినిపించా... వాళ్లు సూపర్ అన్నారు. ఇక ప్రాజెక్టు ఓకే అయ్యిందన్న ఆనందంతో బండిపై బయలుదేరా. మార్గమధ్యలోనే.. ఫోన్ బాగా రింగవుతోంది. బండి పక్కకు ఆపి లిఫ్ట్ చేశా. ‘చూడమ్మా ఈ కథకు బడ్జెట్ ఎక్కువయ్యేట్లు ఉంది.. వేరే కథ ఉంటే చెప్పు’ అన్నారు. ఒక్కసారిగా మైండ్ ఆగిపోయింది. అప్పుడే వర్షం మొదలైంది. అక్కడే రోడ్డు పక్కన కూర్చొని మూడు గంటల పాటు ఏడ్చాను. వెన్నెల కిషోర్కు ఫోన్ చేశాను. అతను కాస్త ధైర్యం ఇచ్చాడు. ‘నువ్వు షార్ట్ ఫిల్మ్ గంటలో రాయగలవు... సినిమా ఒక రోజులో రాయలేవా?’ అని నన్ను ప్రోత్సహించాడు. ఆ ఉత్సాహంలో జోరుగా అక్కడి నుంచి లేచి బయలు దేరదామని బండి స్టార్ట్ చేస్తే కాలేదు. పెట్రోల్ అయిపోయింది. చేతిలో చిల్లగవ్వ లేదు. జోరున వాన. ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు. బండిని అలా నెట్టుకుంటూ జూబ్లీహిల్స్ నుంచి ముషీరాబాద్ వరకూ వచ్చాను. ఆ ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు... బాధ, కోపం, కసి అన్నీ రకాల ఫీలింగ్స్ వచ్చాయి. అదే ఆలోచనలతో ఇంటికి వచ్చి తల తుడుచుకున్నా... అంతే ‘రన్ రాజా రన్’ కథ ఫ్లాష్ అయ్యింది. వెంటనే ప్రొడక్షన్ వాళ్లకు ఫోన్ చేసి ‘సంవత్సరం నుంచి ఓ కథ రాస్తున్నా... చెప్పమంటారా?’ అని అడిగా. రేపు వచ్చేయ్ అన్నారు. నాకు కొంచెం ఇంట్లో ఇబ్బంది ఉంది మూడు రోజుల్లో వస్తానని చెప్పి... ‘రన్ రాజా రాన్’ కథ మొత్తం రాసి తీసుకెళ్లా. ఒక్క డైలాగ్ కూడా మార్చకుండా... ఓకే చేశారు. ఒక ఓటమి వచ్చిందని బాధ పడకూడదు... మరో ప్రయత్నం మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది.’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింపజేస్తాం
‘బాహుబలి’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేటెడ్ సిరీస్ ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’. దీనికి జీవన్ జె.కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. -
ఊరిస్తున్న ఎన్టీఆర్
‘దేవర’ ప్రచార చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించారు ఎన్టీఆర్. ‘వార్ 2’ కోసం హిందీలోకి అడుగుపెట్టి.... ఆ కొత్త ప్రయాణం గురించీ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేశారు. ఆయన పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో మరోసారి ‘దేవర’ ప్రచార చిత్రాలు కానీ, పాటతో కానీ హంగామా చేయొచ్చని పరిశ్రమ, అభిమాన వర్గాల అంచనా. -
తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ మలుపు... ఆర్య
‘‘తెలుగు సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించేలా అప్పట్లో ‘ఆర్య’ తీశారు సుకుమార్. ఎంతో మంది దర్శకులు... ఎన్నో మంచి చిత్రాలు ఈ సినిమా నుంచే వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు’’ అన్నారు అల్లు అర్జున్. -
మెరుపుల తార.. తళుకుల చీర
అందం, నటనతో అలరిస్తున్న బాలీవుడ్ అగ్రనాయిక అలియా భట్ ఈసారి ఆకట్టుకునే వస్త్రధారణతో అంతర్జాతీయ యవనికపై అలరించింది. ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక ‘మెట్ గలా’లో ఆమె చీరలో మెరిసింది. -
రోడ్లన్నీ గతుకులపాలే.. ఊరంతా చీకటిపాలే
ఓట్లు కొనేసి ఆ తర్వాత ప్రజల బాగుని మరిచే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని... గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిస్తూ ‘కమిటీ కుర్రోళ్ళు’ పాటందుకున్నారు. మరి వారి ఆట పాట జనాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘డియర్ స్టూడెంట్స్’ సందడి మొదలు
ఇటీవలే ‘డియర్ స్టూడెంట్స్’ అగ్రతార నయనతారకు స్వాగతం పలికారు. ఈమె, నివిన్ పౌలీ జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రమిది. సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్రాయ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. -
జులై 20న... కౌలాలంపూర్లో
తెలుగు సినిమా వైభవాన్ని... వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుకని నిర్వహిస్తామని చెప్పారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. జులై 20న కౌలాలంపూర్, బుకిట్ జలీల్లోని ప్రతిష్ఠాత్మక నేషనల్ స్టేడియంలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
తెరపై యుద్ధం.. ఖర్చు రూ.8కోట్లు
‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఇప్పుడు ‘స్వయంభూ’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తామని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్