Chiranjeevi: దర్శకుడు బాబీకి ‘చిరు’ కానుక

చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) ఓ చిత్రం తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవిని కలిశారు బాబీ.

Published : 02 Aug 2021 01:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) ఓ చిత్రం తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. దర్శకరచయితగా కాకుండా ఓ అభిమానిగా చిరంజీవి కోసం వినూత్న కథని సిద్ధం చేస్తున్నారాయన. ఇదిలా ఉండగానే చిరంజీవి నుంచి ప్రత్యేక బహుమతి అందుకున్నారు బాబీ. అదేంటంటే.. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవిని కలిశారు బాబీ. బాబీకి శుభాకాంక్షలు తెలిపి, ఓ పెన్నుని కానుకగా అందించారు చిరంజీవి. బాబీ.. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘కోట్లాదిమంది మీ అభిమానుల్లో ఒకడినైన నేను మిమ్మల్ని డైరెక్ట్‌ చేస్తుండటం ఆనందంగా ఉంది. నా కల నిజమైంది. మీరిచ్చిన బహుమతికి ప్రత్యేక కృతజ్ఞతలు సర్‌’ అని చిరంజీవిని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. పలు సూపర్‌హిట్‌ చిత్రాలకు రచయితగా పనిచేసిన బాబీ ‘పవర్‌’తో దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంలో విజయం అందుకున్న ఆయన  ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’, ‘జై లవకుశ’, ‘వెంకీమామ’ చిత్రాల్ని అందించారు. చిరంజీవితో త్వరలోనే ఓ క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని