Chiranjeevi: అభిమానికి అండగా నిలిచిన చిరంజీవి

అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి తన దయా హృదయాన్ని చాటుకున్నారు. తనని ఎంతగానో ఆరాధించే ఓ అభిమానికి అండగా నిలిచారు. విశాఖపట్నానికి చెందిన వెంకట్‌ అనే వ్యక్తి చిరంజీవికి వీరాభిమాని...

Updated : 24 Oct 2021 16:00 IST

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి ఓ అభిమానికి అండగా నిలిచారు. విశాఖపట్నానికి చెందిన వెంకట్‌ అనే వ్యక్తి చిరంజీవికి వీరాభిమాని. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలోనే తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ.. చిరంజీవిని కలవాలనుకుంటున్నానని ఇటీవల వెంకట్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. సొంత ఖర్చులతో వెంకట్‌ దంపతులను హైదరాబాద్‌కు రప్పించారు. ఆదివారం ఉదయం తన నివాసంలోనే చిరంజీవి వాళ్లను కలిసి మాట్లాడారు. వెంకట్‌ ఆరోగ్య, ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్న చిరు.. వైద్యానికి అవసరమైన ఖర్చు మొత్తం తానే పెట్టుకుంటానని మాటిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌, విశాఖపట్నంలోని పలువురు వైద్యులతోనూ చర్చించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని