LoveStories: ఎట్టకేలకు ఒకటి పూర్తి చేశారు.. మరొకటి వీడియో షేర్ చేశారు..!
సాధారణంగా తెలుగు చిత్రపరిశ్రమలో ప్రేమకథలకు కొదవే లేదు. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో టీటౌన్లో రెండు క్రేజీ ప్రాజెక్ట్లు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న...
హైదరాబాద్: సాధారణంగా తెలుగు చిత్రపరిశ్రమలో ప్రేమకథలకు కొదవే లేదు. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో టీటౌన్లో రెండు క్రేజీ ప్రాజెక్ట్లు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘రాధేశ్యామ్’. మరొకటి శర్వానంద్-సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మహాసముద్రం’. గురువారం ఈ రెండు చిత్రాలకు సంబంధించిన సరికొత్త అప్డేట్స్ బయటకు వచ్చాయి.
ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టారు..!
ప్రభాస్ కథానాయకుడిగా కె.రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వింటేజ్ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. పూజాహెగ్డే కథానాయిక. #Prabhas20గా రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్ట్ను 2018లోనే ప్రకటించారు. 2019లో ‘సాహో’ విడుదలైన తర్వాత నుంచి ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ పనుల్లోనే బిజీగా ఉంటున్నారు. ఇటలీలో భారీ సెట్ క్రియేట్ చేసి ప్రధాన సన్నివేశాల షూట్ అక్కడే పూర్తి చేశారు. చిత్రీకరణ చివరిదశకు వచ్చిన సమయంలో కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడటం జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్లో ‘రాధేశ్యామ్’ షూటింగ్ పునఃప్రారంభించి చివరి షెడ్యూల్ను విజయవంతంగా గురువారంతో పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘రాధేశ్యామ్’ టీమ్ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. త్వరలోనే పోస్ట్ ప్రొడెక్షన్ పనులు పూర్తి చేసుకుని ఈ ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
పోస్టర్ కాదు ఈ సారి ఏకంగా మోషన్ పోస్టరే..!
శర్వానంద్, సిద్దార్థ్ మల్టీస్టారర్గా తెరకెక్కుతోన్న ఇంటెన్స్ ప్రేమకథా చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఆదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. జగపతిబాబు, రావు రమేశ్ కీలకపాత్రలు పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ పలు పోస్టర్లను చిత్రబృందం షేర్ చేసింది. కాగా, తాజాగా గురువారం ఉదయం ఈ సినిమా మోషన్ పోస్టర్ను అభిమానులతో పంచుకుంది. సిద్దార్థ్, శర్వానంద్ల లుక్లు తెలియజేసే విధంగా సిద్ధమైన ఈ వీడియో ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్